YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

గుట్కాఅక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

గుట్కాఅక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

గుట్కాఅక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
కేసు నమోదు                  
మంత్రాలయం ఏప్రిల్ 18
కర్ణాటక సరిహద్దు నుండి ఆంధ్రాలో కి అక్రమ గుట్కా రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన శనివారం జరిగింది. మంత్రాలయం ఎస్సై  ఎరన్న తెలిపిన వివరాల ప్రకారం మంత్రాలయం చెందిన  రామాంజనేయులు, హనుమంతు విజయ్ అను ముగ్గురు వ్యక్తులను దాడులు నిర్వహించి గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని,వారిని  అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ  గుట్కా రవాణా చేస్తున్నారని సమాచారం అందడంతో మేము మా పోలీసులతోదాడులు నిర్వహించి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని, ముగ్గురు వ్యక్తులను అరెస్టు, చేసి కారును సీజ్ చేశామన్నారు.దాదాపుగా లక్షా 70 వేల విలువైన గుట్కా ప్యాకెట్లు ఉన్నట్లు తెలిపారు. అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిపై  కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  పోలీసులు నటరాజు, జయన్న ,శ్రీరాములు, హోంగార్డు నాగేశ్వరరావు, వీరేశ్  తదితరులు ఉన్నారు.

 

Related Posts