YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ వైద్యులకు పరమౌషధం కానున్న ప్లాస్మా !

కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ వైద్యులకు పరమౌషధం కానున్న ప్లాస్మా !

 

కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ వైద్యులకు పరమౌషధం కానున్న ప్లాస్మా !
కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ వైద్యులకుమరింత ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్లాస్మా యాంటీ బాడీలతో చికిత్స విధానం   కోవిడ్‌ నుంచి కోలుకున్న రోగుల నుంచి ప్లాస్మా యాంటీ బాడీలను తీసుకొని వాటిని కోవిడ్‌ రోగికి ఎక్కించడం ద్వారా ఎక్కువ శాతం ఫలితం వస్తోందని, మరణాల రేటు చాలా తక్కువగా ఉందని వైద్య   నిపుణులు అభిప్రాయపడుతున్నారు  ఈ సందర్భంలో  కన్వాల్సెంట్‌ ప్లాస్మా చికిత్సపై పరిశోధనలు జరిపేందుకు ముందుకొచ్చే సంస్థలు దరఖాస్తు చేసుకోవాలంటూ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఆమోదించింది  దీంతో కొన్ని సంస్థలు పరీక్షలు జరిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి   ప్లాస్మా చికిత్సపై సెంట్రల్‌ డ్రగ్‌ రెగ్యులేటర్‌ అనుమతి ఇచ్చింది. ఐసీఎంఆర్‌ రూపొందించిన ప్రొటోకాల్‌ ప్రకారం దీనికి అనుమతులిచ్చింది. సెంట్రల్‌ డ్రగ్‌ రెగ్యులేటర్‌కు ఐసీఎంఆర్‌ ఇచ్చిన నివేదికలో ప్లాస్మా చికిత్స పరిశోధనలపై పనిచేయనున్న సంస్థల పేర్లు వెల్లడించాయి . ప్రజా ప్రయోజనాలను పరిగణలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డ్రగ్‌ రెగ్యులేటరీ తెలిపింది. వాటిని తమ సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ పూర్తిగా పరిశీలించినట్లు వెల్లడించింది. డ్రగ్స్‌ అండ్‌ క్లినికల్‌ ట్రయల్‌ రూల్స్‌ కింద అనుమతులిచ్చినట్లు స్పష్టం చేసింది.

Related Posts