YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు

లక్నోలో దుర్మార్గులు దుశ్చర్య  పారిశుధ్య కార్మికుడిని చావగొట్టి.. శానిటైజర్ తాగించి 

లక్నోలో దుర్మార్గులు దుశ్చర్య  పారిశుధ్య కార్మికుడిని చావగొట్టి.. శానిటైజర్ తాగించి 

లక్నోలో దుర్మార్గులు దుశ్చర్య  పారిశుధ్య కార్మికుడిని చావగొట్టి.. శానిటైజర్ తాగించి 

లక్నో: 19  దేశం మొత్తం కరోనాపై పోరులో ఉంటే  ముఖ్యంగా ఆరోగ్య, పారిశుధ్య సిబ్బంది ఈ యుద్ధంలో ముందుండి అందరి ప్రాణాలు కాపాడటానికి అహర్నిశలు శ్రమిస్తుంటే  కొందరు దుర్మార్గులు తమ దుర్బుద్ధి చాటుకొంటున్నారు. ఆరోగ్య, పారిశుధ్య కార్మికులపై దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ జిల్లాలో ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. మోతిపూరాలో శానిటైజేషన్‌ డ్యూటీ చేస్తున్న ఓ పారిశుధ్య కార్మికుడిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఆ యువకుడిని చావగొట్టారు. అయినా కసి తీరకపోవడంతో ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం అతను రోడ్డుపై చల్లుతున్న శానిటైజర్ తీసుకొని బలవంతంగా తాగించారు. ఈ దారుణమైన ఘటన ఏప్రిల్ 14న జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పారిశుధ్య కార్మికుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడ్రోజుల తర్వాత మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి  ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశామని రామ్‌పూర్ అదనపు ఎస్పీ తెలియజేశారు.

Related Posts