ఎమ్మెల్యే అంబటి చొరవతో సమసిన వివాదం
ఆందోళన విరమించిన ముస్లింలు
మృతుని కుటుంబానికి రూ.1లక్ష సాయం
ప్రభుత్వం నుండి ఆదుకునేందుకు కృషి : ఎమ్మెల్యే అంబటి
గుంటూరు ఏప్రిల్ 20
సత్తెనపల్లిలో జరిగిన సంఘటన దురదృష్ట కరమని, పోలీసులపై. తక్షణ చర్యలకు ఆదేశించామని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.మృతి చెందిన బాధితుడి గౌస్ కుటుంబానికి తను (ఎమ్మెల్యే) వ్యక్తిగతంగా లక్ష రూపాయలు ఆర్ధిక సాయం అందించారు. మృతుని కుటుంబీకులను ఫోన్లో పరామర్శించి ప్రభుత్వం నుండి కూడా ఆదుకొనేఎందుకు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంఘట జరిగిన వెంటనే జిల్లా అధికారులతో మాట్లాడటం, పట్టణంలో ఉద్రిక్తత నెలకొనకుండా ముస్లిం సంఘ పెద్దలతో మాట్లాడి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంబటి చొరవతీసుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో పరిస్థితి చేజారకుండా సమస్య సద్దుమనగడంతో నియోజకవర్గ ప్రజానీకం ఊపిరిపీల్చుకుంది. ప్రజలను సంయమనం పాటించాలని ఎమ్మెల్యే అంబటి కోరారు.