YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్

ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్

ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్
ముంబై, ఏప్రిల్ 20
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 4200 దాటగా.. ముంబైలోనే ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. దేశ ఆర్థిక రాజధాని కరోనా కారణంగా విలవిల్లాడుతోంది. ఆదివారం మహారాష్ట్రలో 552 కరోనా కేసులు నమోదు కాగా 456 కేసులు ఒక్క ముంబై నగరంలోనే నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది. ముంబై నగరంలో భారీ సంఖ్యలో జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడినట్లు తేలింది. 170 మంది రిపోర్టర్లు, వీడియో జర్నలిస్టులు, డ్రైవర్లకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 53 మందికి పాజిటివ్ అని తేలినట్లు సమాచారం. వీరిలో ఎవరిలోనూ కరోనా లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం.కాగా చెన్నైలోనూ ముగ్గురు జర్నలిస్టులు కోవిడ్ బారిన పడినట్లు సమాచారం. ముగ్గురు జర్నలిస్టులకు కరోనా సోకినట్లు తేలడంతో.. చెన్నైలోని మిగతా జర్నలిస్టులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇంతకు ముందే మధ్యప్రదేశ్‌లోని ఓ జర్నలిస్టుకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. అంతకు ముందే ఆయన కమల్‌నాథ్ మీటింగ్‌కు హాజరు కావడంతో ఆందోళన వ్యక్తమైంది.జర్నలిస్టుల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో మీడియా సంస్థల యాజమాన్యాలు ముంబైలో రిపోర్టర్లను క్షేత్రస్థాయి రిపోర్టింగ్‌కు పంపొద్దని కొందరు జర్నలిస్టులు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చీఫ్ శేఖర్ గుప్తా, న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్‌ను కోరుతున్నారు.
 

Related Posts