YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మూడు వారాల్లో రంగులు తొలగించండి

మూడు వారాల్లో రంగులు తొలగించండి

మూడు వారాల్లో రంగులు తొలగించండి
విజయవాడ, ఏప్రిల్ 20
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ కార్యాలయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను పోలిన రంగులు వెంటనే తొలగించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అయితే రంగులు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3 వారాల గడువు కోరింది. దీనికి అంగీకరించిన ధర్మాసనం ఈ మేరకు గడువిచ్చింది.పంచాయతీ కార్యాలయాల రంగులు తీసేయాలని, ప్రభుత్వ కార్యాలయాలకు ఏ పార్టీతో సంబంధం లేని రంగులేయాలని హైకోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తీర్పు అమలుకు మరికొంత గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. రంగులు తొలగించేందుకు ప్రభుత్వానికి 3 వారాల గడువిచ్చింది.కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు ఆ పార్టీ జెండా పోలిన రంగులు వేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కచ్చితంగా రంగులు తొలగించాలని ఆదేశించింది.

Related Posts