YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాష్ట్రపతి భవన్లో పాజిటివ్ కేసు

రాష్ట్రపతి భవన్లో పాజిటివ్ కేసు

రాష్ట్రపతి భవన్లో పాజిటివ్ కేసు
న్యూఢిల్లీ ఏప్రిల్ 21
హస్తినలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ప్రతిష్టాత్మక రాష్ట్రపతిభవన్లో కరోనా పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చింది. రాష్ట్రపతి భవన్లో పనిచేసే ఒక పారిశుధ్య కార్మికుని కోడలికి కరోనా పాజిటివ్గా తేలినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ బంధువు తల్లి ఇప్పటికే కరోనాతో మరణించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కార్మికుని ఇంటిని అధికారులు సీజ్ చేశారు. కుటుంబ సభ్యులను ఈ నెల 18నే క్వారంటైన్కు పంపించారు. మరోవైపు కార్మికుని ఇంటికి సమీపంలోని 30 ఉద్యోగ కుటుంబాలను అధికారు పర్యవేక్షణలో ఉంచారు. ప్రభుత్వమే వారికి ఆహారం సరఫరా చేస్తోంది. ఉద్యోగులతోపాటు కుటుంబంలోని ఎవరినీ ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. మొత్తంమీద ఈ 125 కుటుంబాల  ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
 

Related Posts