YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం

మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం

పశ్చిమగోదావరి జిల్లా ఆరాచక పర్వం వెలుగు చూసింది.నర్సాపురం మండలం సాయంపాలెం గ్రామానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన చింతపల్లి ప్రసాద్ భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.దీనిపై గ్రామపెద్దలు నాగేంద్ర తండ్రీ సంజీవరావుని కుమారుడిని అప్పగించాలని ఆదేశించారు.అయితే కుమారుడు పరారీలో ఉన్నాడని, ఆచూకీ తెలియదని చెప్పడంతో ఆయన చెట్టుకు కట్టేసి పంచాయితీ చేశారు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా మారడంతో ఆయనను జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts