YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో పొలిటికల్ వార్

ఏపీలో పొలిటికల్ వార్

ఏపీలో పొలిటికల్ వార్
విజయవాడ, ఏప్రిల్ 21
రాష్ట్రంలో కరోనా వైరస్ సంక్షోభం తీవ్రమవుతున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగట్లేదు. ఇప్పటి వరకు వైసీపీ వర్సెస్ టీడీపీగా ఉన్న ఏపీ రాజకీయాలు గత రెండు రోజులుగా వైసీపీ వర్సెస్ బీజేపీగా మారిపోయాయి. కరోనా పరీక్షలకు సంబంధించిన ర్యాపిడ్ కిట్ల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేయడంతో మొదలైన వివాదం రోజురోజుకూ ముదురుతోంది. కరోనా కిట్ల కొనుగోలుపై మొదలైన వివాదం.. వ్యక్తిగతంగా దూషించుకునే స్థాయికి వెళ్లింది. ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాపై విమర్శలు గుప్పించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి.. తాగా, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని టార్గెట్ చేశారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం వరుస ట్వీట్లు చేశారు.బ్యాంకుల నుంచి సుజనా చౌదరి రు. 5,700 కోట్లు లూటీ చేశారు. వడ్డీతో కలిపి ఆ మొత్తం రూ. 10,000 కోట్లకు చేరింది. బీజేపీలో కోవర్టు పనులు చేస్తూ, చంద్రబాబు బానిసలా పేమెంట్స్ చూస్తున్నాడు. తిరిగే కారు, వేసుకున్న బట్టలు, తినే తిండి అంతా బ్యాంకుల్లో ప్రజలు పొదుపు చేసుకున్న డబ్బుతో కొన్నవే సుజనా.రాజ్యసభ సీటుకు రూ. వంద కోట్లు, ‘సున్నా’కు పేమెంటు చేసిన రూ. 20 కోట్లు, ఎన్నికల్లో అభ్యర్థులకు పంపిణీ చేసిన రూ. వెయ్యి కోట్లు, ఇన్ సైడర్ ట్రేడింగులో 500 ఎకరాలు కొన్నది బ్యాంకుల డబ్బుతోనే కదా. పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటనలు వస్తున్నా బేఫికర్ గా ఉన్నావంటే నీది మామూలు ‘గుండె’ కాదు సుజనా.’’ అంటూ విజయసాయిరెడ్డి ఓ రేంజ్‌లో ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలకు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించాల్సి ఉంది.
 

Related Posts