YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

లాక్ డౌన్ తర్వాత మారనున్న ప్రపంచం

లాక్ డౌన్ తర్వాత మారనున్న ప్రపంచం

లాక్ డౌన్ తర్వాత మారనున్న ప్రపంచం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21
కరోనా వైరస్ నీలినీడలు తొలిగిన తర్వాత, లాక్‌డౌన్ ముగిసిన తర్వాత.. ప్రపంచం ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం సగటు మనిషి మదిలో మెదిలే ప్రశ్న ఇది. అందుకు సమాధానమే ఈ వీడియో. భవిష్యత్తులో భారత్‌లో పరిస్థితి ఎలా ఉండబోతుందో ఈ దృశ్యాలను గమనిస్తే అర్థమవుతుంది. లాక్‌డౌన్ తర్వాత రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు.మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో నిర్వహించినట్లుగా చెబుతున్న ఈ రిహార్సల్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. సోషల్ డిస్టాన్స్ పాటిస్తూ.. క్యూ లైన్లలో ఒక క్రమ పద్ధతిలో ఒకరి తర్వాత ఒకరు రైల్వే స్టేషన్‌కు ఎలా చేరుకోవాలో, అక్కడ నుంచి ప్లాట్‌ఫాంపైకి ఎలా వెళ్లాలో అధికారులు రైల్వే సిబ్బందితో రిహార్సల్స్ చేసి చూపించారు.కరోనా వైరస్ ప్రపంచ గమనాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఇప్పటికే మానవ జీవన విధానంపై పెను ప్రభావం చూపింది. ప్రకృతి, సహజ వనరుల విలువ ఏంటో మనిషికి తెలియజెప్పింది. ఎంతసేపూ సంపాదన, ఆస్తులు కూడబెట్టడానికే పాకులాడే మనిషికి.. జీవితంలో అసలైన ఆస్తులేమిటో అర్థమయ్యేలా చెప్పింది. విచ్చలవిడిగా తిరిగే మనిషిని ఇంట్లో కూర్చోబెట్టి క్రమశిక్షణ పాఠాలు చెబుతోంది.ఇకపై రైల్వే స్టేషన్లు కూడా ఎయిర్‌పోర్టులను తలపించే పరిస్థితులు రానున్నాయని ఈ వీడియోను చూస్తే అర్థమవుతోంది. రైలు ఎక్కాలంటే.. ఓ 2 గంటల ముందే స్టేషన్‌కు చేరుకోవాలనే సంకేతం అందుతోంది. చైనా సహా లాక్‌డౌన్ ఎత్తేసిన దేశాల్లో ఇప్పటికే ఈ విధానాలను అనుసరిస్తుండటం గమనార్హం.కరోనా వైరస్ కేసులు తగ్గినా.. ఈ మహమ్మారి తాలూకు భయాలు ఇప్పుడప్పుడే ప్రపంచాన్ని వీడేలా లేవు. ఆరుబయటకి వస్తే మాస్కులు ధరించాల్సిందే. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాల్సిందే. రద్దీ ప్రాంతాల్లో ఇంతకుముందులా గుంపులు గుంపులుగా కాకుండా పూర్తి క్రమశిక్షణతో వ్యవహరించాల్సిందే. ఇకపై సామాజిక దూరం ఓ అలవాటుగా మారాల్సిందే!! ఏమంటారూ..!

Related Posts