YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ పై అచ్చెన్న సెటైర్లు

జగన్ పై అచ్చెన్న సెటైర్లు

జగన్ పై అచ్చెన్న సెటైర్లు
శ్రీకాకుళం, ఏప్రిల్ 22
కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో నివారణ చర్యలతో పాటు ప్రజల్ని కాపాడుకోవడానికి స్వయంగా ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో పని చేస్తుంటే, మన సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాత్రం రాజప్రసాదం విడిచి రావట్లేదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు.65 ఏళ్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గ్రౌండ్‌లో పని చేస్తున్నారు. 65 ఏళ్ల తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి క్షేత్రస్థాయిలో ఉన్నారు. 63 ఏళ్ల గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని సహాయక కార్యక్రమాల్లో నేరుగా పాల్గొంటున్నారు. 58 ఏళ్ళ అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద్ సోనోవాల్ క్షేత్రస్థాయిలో కరోనా నివారణ చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 61 ఏళ్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహన్ గ్రౌండ్ లెవల్‌లో తిరుగుతూ రైతుల కష్టాలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారు. మేఘాలయ ముఖ్యమంత్రి కోనార్డ్ సంగ్మా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలకు సహాయం అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గ్రౌండ్‌లో పని చేస్తున్నారు. 77 ఏళ్ల కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప క్షేత్ర స్థాయిలో ఉండి కరోనా పై పోరాటం చేస్తున్నారు.మరి యువ ముఖ్యమంత్రిగా అనే చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాత్రం తాడేపల్లి రాజప్రసాదంలో నుంచి బయటకు రారా? రాజకీయమే ఆయనకు ముఖ్యమా?’’ అని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శించారు.

Related Posts