YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వైరల్ అవుతున్న ఎమ్మెల్యే వార్నింగ్

వైరల్ అవుతున్న ఎమ్మెల్యే వార్నింగ్

వైరల్ అవుతున్న ఎమ్మెల్యే వార్నింగ్
నిజామాబాద్, ఏప్రిల్ 22
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్‌ అహ్మద్‌కు సంబంధించి ఓ ఆడియో టేపు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఆడియోలో ఉంది. రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ను అమలు చేసేందుకు పోలీసులు కాస్త కఠినంగానే వ్యవహరిస్తు్న్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అమలు చేసే విషయంలో పోలీసుల తీరుపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. బోధన్ ఏసీపీ జైపాల్ రెడ్డి, బోధన్ పట్టణ సీఐ రాకేష్ గౌడ్‌తో సహా ఎస్సైల పేర్లను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే షకీల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.లాక్‌ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఓ వర్గాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకొని పోలీసులు ప్రవర్తిస్తున్నారని ఆయన ఆడియో ఫైల్‌లో ఆరోపించారు. బోధన్ పోలీసుల తీరుపై నిజామాబాద్ కమిషనర్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులందరికీ ఫిర్యాదు చేసినా వారి తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా లాక్ వేళ ప్రజలతో స్నేహ పూర్వకంగా ఉండాలని, వారికి ఏదైనా విషయం సముదాయిస్తూ చెప్పాలని పోలీసులకు ఎమ్మెల్యే సూచించారు. ‘‘పోలీసు వారికి నేను గట్టి వార్నింగ్ ఇస్తున్నా. లాక్ డౌన్‌లో భాగంగా విధులు నిర్వహిస్తున్న ఏసీపీ జైపాల్ రెడ్డి, సీఐ రాకేష్ తీరు బాగాలేదు. లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్నారని ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ కావాలని కొడుతున్నారు. ఇది ఏమాత్రం ఆమోదించదగ్గ విషయం కాదు.’’ అని అన్నారు.ప్రస్తుతం పోలీసులు ప్రవర్తిస్తున్న తీరునే కొనసాగిస్తే పోలీసులపై ప్రజలు తిరగబడతారని ఎమ్మెల్యే వారిని హెచ్చరించారు. అయితే, ఇది బోధన్ ఎమ్మెల్యే షకీల్ చేసిన హెచ్చరిక అంటూ గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఆడియో విపరీతంగా వైరల్ అవుతోంది
 

Related Posts