ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో పెన్షన్ చెల్లించాలి
జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
అమరావతి ఏప్రిల్ 22
సీఎం జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. మార్చి నెలకు సంబంధించి సగం జీతాలే చెల్లించడం సరికాదని హితవుపలికారు. సుదీర్ఘకాలం ప్రభుత్వ సేవలందించిన వారి పట్ల ఈ తరహా చర్య తగదవని సూచించారు. పెన్షనర్ల జీతభత్యాల్లో ఎలాంటి కోత విధించరాదని చట్టం స్పష్టం చేస్తోందని, పెన్షన్ అందుకునే వారంతా 60ఏళ్లు పైబడిన వారే... ఈ వయసు వారికి కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువ అని చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు. వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యలకు వైద్య ఖర్చులు అధికంగా ఉంటాయని, విశ్రాంత ఉద్యోగులకు 100శాతం పెన్షన్లు చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.