YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నిరాడంబరంగా టీఆర్ఎస్ 20వ వార్షికోత్సవం

నిరాడంబరంగా టీఆర్ఎస్ 20వ వార్షికోత్సవం

నిరాడంబరంగా టీఆర్ఎస్ 20వ వార్షికోత్సవం
హైద్రాబాద్, ఏప్రిల్ 22
కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో నిరాడంబరంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలను జరుపుకుంటూ, సామాజిక హితానికి పాల్పడదామని ఆయన పిలుపునిచ్చారు.ఏప్రిల్ 27 తో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) ఆవిర్భవించి 20 సంవత్సరాలు నిండుతున్నాయి. సాధారణ రోజుల్లో అయితే ఈ సందర్భాన్ని పెద్ద ఉత్సవంగా జరుపుకోవాల్సింది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వల్ల ఉన్న విషాద పరిస్థితుల్లో చాలా సాదాసీదాగా ఈ 20 ఏళ్ల ఆవిర్భావ పండుగను జరుపుకోవాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ యువ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పార్టీ శ్రేణులకు ఓ పిలుపునిచ్చారు.కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో నిరాడంబరంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలను జరుపుకుంటూ, సామాజిక హితానికి పాల్పడదామని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తప్పకుండా మాస్కులు ధరించడంతో పాటు ప్రజలకు సైతం పంపిణీ చేయాలని సూచించారు. ఈ పంపిణీ యుద్ధప్రాతిపదికన జరగాలని, సామాజిక దూరాన్ని మాత్రం ఈ సమయంలో కచ్చితంగా పాటించాలని నిర్దేశించారు. టీఆర్ఎస్ 20వ వార్షికోత్సవాన్ని సూచించేలా కేసీఆర్ చిత్ర పటంతో తయారు చేసిన మాస్క్‌ను ధరించిన ఫోటోలను ఈ సందర్భంగా సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. అదే రకమైన మాస్క్ లను తయారుచేసి, పంపిణీ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ రకమైన మాస్కులను ధరించిన ఫోటోలను తనకు షేర్ చేయాలని సంతోష్ కుమార్ పార్టీ శ్రేణులకు, నాయకులకు ట్విటర్ ద్వారా సూచించారు.
 

Related Posts