YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనా లేని ప్రాంతాలకు సర్టిఫికెట్లు

కరోనా లేని ప్రాంతాలకు సర్టిఫికెట్లు

కరోనా లేని ప్రాంతాలకు సర్టిఫికెట్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22
కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తరువాత పర్యాటక పరిశ్రమకు మరలా పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు, ప్రజల్లో ఉన్న భయాలను పోగొట్టేందుకు టర్కీ ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచన చేసింది. టర్కీలోని అనేక పర్యాటక ప్రదేశాల భద్రతపై పూర్తి హామీ ఇవ్వడానికి టర్కీ సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి నూరి ఎర్సోయ్ ఒక కొత్త ప్రయత్నాన్ని ఇటీవల ప్రకటించారు. దీని ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గిన తరువాత పర్యాటక పరిశ్రమను పునరుద్ధరించడానికి కావాల్సిన సౌకర్యాలతో పాటు కరోనా వైరస్ లేని పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటికి సర్టిఫికేషన్ ను కూడా అందించనున్నారు. మే చివరి నాటికి ఇక్కడి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మంత్రి మీడియాకు తెలియజేస్తూ... ధృవీకరణ వ్యవస్థకు సంబంధించిన మార్గదర్శకాలు మరియు నిబంధనలను పరిశీలించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు మరియు పరిశ్రమ ప్రతినిధులతో తమ మంత్రిత్వ శాఖ పని చేస్తుందని పేర్కొన్నారు. పర్యాటక ఆధారిత వ్యాపారాలకు మంత్రిత్వ శాఖ త్వరలో 'కరోనా వైరస్ ఫ్రీ' సర్టిఫికేట్ లను ప్రారంభిస్తుందని, ఇవి తగిన పరిశుభ్రత మరియు భద్రతా చర్యలు ఆయా వ్యాపారస్తులు పాటిస్తున్నారని నిర్ధారించేందుకు ఉపయోగపడతాయని ఆయన అన్నారు.అదే విధంగా మే మొదటి వారం నాటికి ఈ సర్టిఫికేషన్ సిస్టంను ముగించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందుకోసం ఎన్‌జి‌ఓ లను కూడా ఈ కమిషన్ లో భాగస్వాములను చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. దీని తరువాత వారు పర్యాటక సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు మే చివరి నాటికి ఈ సర్టిఫికేట్లను పొందుతారని వెల్లడించారు.కరోనా మహమ్మారి ప్రభావం తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తరువాత జూన్ మధ్యలో దేశీయ పర్యాటక రంగం తిరిగి ప్రారంభమవుతుందని పర్యాటక మంత్రి మరింత ఆశాభావం వ్యక్తం చేశారు.ఎర్సోయ్ ప్రకారం... పరిస్థితులు సద్దుమణిగిన తరువాత అన్ని పర్యాటక రవాణా వాహనాలు క్రమం తప్పకుండా శుభ్రపరచబడతాయి. అలాగే రవాణా సిబ్బందికి తగిన ఆరోగ్య పరీక్షలు చేసిన తరువాత కరోనా మహమ్మారికి సంబంధించి శిక్షణ అందిస్తారు. అంతేకాకుండా పర్యాటకులు ఆరోగ్య పత్రాలను కూడా ఇవాల్సి ఉంటుంది.విమానాశ్రయాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, పురావస్తు ప్రదేశాలు, మ్యూజియంల వద్ద సామాజిక దూరం పాటించే విధంగా కొత్త నిబంధనలు రూపకల్పన చేయడం జరుగుతుంది. అంతే కాకుండా థర్మల్ కెమెరాలతో సహా ఆరోగ్య సిబ్బంది, అవసరమైన పరికరాలు ఆన్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. ఆరోగ్య ప్రమాదాలను అరికట్టేందుకు సిబ్బందికి కూడా కోవిడ్ ఫ్రీ సర్టిఫికేట్ లు జారీ చేయబడతాయని మంత్రి తెలిపారు.ఈ సర్టిఫికేషన్ ప్రక్రియను హోటల్ పరిశ్రమ స్వాగతించిందని మధ్యధరా పర్యాటక హోటలియర్స్ అసోసియేషన్ చైర్మన్ పేర్కొన్నారు. ఇటువంటి కరోనా-ఫ్రీ సర్టిఫికేషన్ హోటళ్లు మరియు సర్వీసు ప్రొవైడర్లకు సహాయం చేయడమే కాకుండా వారి పరిశుభ్రత ప్రమాణాల గురించి ప్రయాణికులకు భరోసా ఇస్తుందని, ఇది కరోనాంతర పర్యాటక సమయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
 

Related Posts