YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

భార్యను అమ్మేసిన భర్త

భార్యను అమ్మేసిన భర్త

భార్యను అమ్మేసిన భర్త
లక్నో, ఏప్రిల్ 22
మహిళలకు సమాజంలోనే కాదు ఇంట్లోనే రక్షణ ఉండటం లేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల వెలుగుచూసిన ఓ ఘటన వివాహ బంధానికే మాయని మచ్చగా నిలిచింది. ఓ వ్యక్తి అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యనే మరొకరికి అమ్మేశాడు. అది కూడా రెండు గంటల కోసం ఏకంగా రూ.10వేలు తీసుకున్నాడు. ఈ ఘటన యూపీలోని పాక్‌బాడా పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.సంబల్‌ పట్టణంలోని హసంపూర్ కూడలికి చెందిన ఓ వ్యక్తి ఆదివారం తన భార్య కనిపించడం లేదని పాక్‌బాడా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను గున్నోర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల ఓ ఇంట్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి ఆమెను ప్రశ్నించగా షాకింగ్ విషయం చెప్పింది. భర్తే తనను రూ.10వేల కోసం మరో వ్యక్తికి రెండు గంటల కోసం అమ్మేశాడని ఆమె చెప్పింది.దీంతో పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకోగా.. తనకు డబ్బు అవసరముండి ఈ పని చేయాల్సి వచ్చిందని అంగీకరించాడు. తన భార్యను రెండు గంటల తర్వాత తీసుకొస్తానని చెప్పి మోసం చేయడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. ఖలీద్ అనే బ్రోకర్ ద్వారా తన భార్యను గున్నౌర్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి అమ్మానని, ఆ వ్యక్తి ఎవరో తనకు తెలీదని చెప్పాడు. దీంతో పోలీసులు ఖలీద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళను కొనుగోలు చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related Posts