YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

అద్దంకి రెవెన్యూ డివిజన్ గా మార్చండి మహాప్రభో...

అద్దంకి రెవెన్యూ డివిజన్ గా మార్చండి మహాప్రభో...

అద్దంకి పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రజలు కోరతున్నారు. .అద్దంకి డివిజన్‌ ఏర్పాటు చేస్తే అద్దంకి, జె.పంగులూరు, ఇంకొల్లు, మార్టూరు, ముండ్లమూరు, సంతమాగులూరు, కొరిశపాడు, యద్దనపూడి, బల్లికురవ, పర్చూరు మండలాలను కలిపి ఏర్పాటు చేయవచ్చనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్త పరుస్తున్నారు.2014కు ముందు స్థానిక ప్రజా ప్రతినిధులు అద్దంకిని రెవెన్యూ డివిజన్‌గా చేయాలనే ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. అందుకు అవసరమైన ఫైల్‌ను తయారు చేసి కలెక్టరుకు, సీఎంకు  పంపారు. ఈ క్రమంలో అప్పట్లో ఉన్న మూడు డివిజన్లే సరిపోతాయనే ఉన్నతాధికారుల నివేదికతో ఆగింది. ప్రస్తుతం మరో రెండు రెవెన్యూ డివిజన్ల ప్రకటనతో అద్దంకి పరిసర మండలాల ప్రజలు, అద్దంకినే డివిజన్‌ చేయాలని కోరుతున్నారు. జిల్లాలో ఐదు డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. జిల్లాలో 56 మండలాలు, 12 నియోజక వర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కాపురం, కందుకురు, ఒంగోలు డివిజన్లు, మరో రెండు డివిజన్లు ఏర్పాటైతే, ఒక్కో డివిజన్‌లో 11 మండలాల వంతున నాలుగు, 12 మండలాలతో ఒక డివిజన్‌ ఏర్పాటు అవుతాయిగతంలో ప్రజా ప్రతినిధులు అద్దంకిని రెవెన్యూ డివిజన్‌ చేయాలని ప్రతిపాదనలు పంపినా పట్టించుకోలేదు. ఇప్పటికే  లక్ష పోస్ట్‌ కార్డు ఉద్యమం, రాస్తారోకోలు నిర్వహించారు. పరిసర పట్టణాలకు కేంద్ర బిందువుగా ఉన్న అద్దంకి.  పురాతన కాలం నుంచి పరిపాలనకు ప్రధాన కేంద్రంగా పేరుగాంచింది.  ఇక్కడ రాజుల కాలంలోనే రత్నాలు రాశులుగా పోసి విక్రయాలు జరిపినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. రెడ్డి రాజుల మొదలుకుని, ఎందరో రాజులు పట్టణాన్ని రాజధానిగా చేసుకుని, కోట నిర్మాణంతో పరిపాలన సాగించారు. దీంతోపాటు నాటి నుంచి నేటి వరకూ వ్యవసాయ, వర్తక, వాణిజ్య, ఎగుమతులు, దిగుమతుల రంగంలో మంచి పేరు గడించింది.రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రస్తుతం కందుకూరు, మార్కాపురం, ఒంగోలు రెవెన్యూ డివిజన్లు ఉండగా, పరిపాలనా సౌలభ్యం కోసం, మరో రెండు డివిజన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. దీంతోమొదలు ఎన్నో రాజవంశాలు దీన్ని తమ రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాయి.గుండ్లకమ్మ జీవ నది ఒడ్డున ఉన్న అద్దంకి, దాదాపు 1200 ఏళ్ల  నుంచి పట్టణంగా ఉంది.1955 నుంచి నియోజకవర్గ కేంద్రంగా ఉంది. 1950 నుంచి గ్రంథాలయం, 1950లోనే తాలూకా కేంద్రం ఏర్పాటైంది. 1870లో డిస్పెన్సరీ, ప్రస్తుతం అదే 30 పడకల అసుపత్రిగా అభివృద్ధి చెందింది. 1946 నుంచి హైస్కూల్, 1956లోనే ఎన్నెస్పీ ఈఈ కార్యాలయం, 1972 లో సబ్‌ జైలు, గతంలోనే ట్రజరీ, సబ్‌ రిష్ట్రార్‌ కార్యాలయం ఏర్పాటైంది. ఎక్కడా డిగ్రీ కళాశాల లేని రోజుల్లో అద్దంకిలో  1974లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది. ఇంకా 6 జూనియర్‌ కళాశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల బాలిక కళాశాల, రెండు జిల్లా పరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మరో జిల్లా పరిషత్‌ పాఠశాల, వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. పట్టణ, రూరల్‌ పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. రాష్ట్రంలోనే పేరు గాంచిన ప్రముఖ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి పుణ్యక్షేత్రం ఉంది.భౌగోళిక చారిత్రక అంశాలను బట్టి పరిశీలిస్తే కొత్తగా ఏర్పాటు చేయబోయో రెండు డివిజన్లలలో ఒక దాన్ని, పరిసర పట్టణాలకు కేంద్రంగా(మధ్యలో) ఉన్న అద్దంకిలో ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలతో పాటూ, వివిధ మండలాల ప్రజలు కోరుతున్నారు.

Related Posts