YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇప్పుడు మళ్లీ నెంబర్ వన్ గా అంబానీ

ఇప్పుడు మళ్లీ నెంబర్ వన్ గా అంబానీ

ఇప్పుడు మళ్లీ నెంబర్ వన్ గా అంబానీ
ముంబై, ఏప్రిల్ 23
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మళ్లీ ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. మార్క్ జుకర్‌బర్డ్ ఫేస్‌బుక్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ డీల్ ఇందుకు కారణం. ఫేస్‌బుక్ రిలయన్స్ జియోలో 9.99 శాతం వాటా కొనుగోలు చేసింది. దీని కోసం ఏకంగా రూ.43,574 కోట్లు చెల్లించింది.బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న ముకేశ్ అంబానీ ఇప్పుడు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఈకామర్స్ సంస్థ అలీబాబా ఫౌండర్‌ జాక్ మా‌ను వెనక్కి నెట్టారు. బుధవారం రోజున అంబానీ సంపద విలువ 4.7 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 49.2 బిలియన్ డాలర్లకు చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 10 శాతం ర్యాలీ చేయడం ఇందుకు కారణం.దీంతో ముకేశ్ అంబానీ.. జాక్ మాను వెనక్కినెట్టారు. జాక్ మా సందప విలువ 46 బిలియన్ డాలర్లు ఉంది. అంటే ఈయన కన్నా అంబానీ సంపద 3.2 బిలియన్ డాలర్లు ఎక్కువగానే ఉందని గమనించాలి. అంతర్జాతీయంగా అంబానీ బిలియనీర్ ర్యాంక్ కూడా 17వ స్థానానికి చేరింది. ఇక్కడ కూడా జాక్ మా 19వ స్థానంలో ఉన్నారు.ఫేస్‌బుక్ కేవలం రిలయన్స్ జియోలో వాటాలు కొనడం మాత్రమే కాకుండా మరో డీల్‌ను కూడా కుదుర్చుకుంది. ఫేస్‌బుక్ వాట్సాప్, రిలయన్స్ జియో మార్ట్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా కుదిరింది. దీంతో జియో మార్ట్ ద్వారా వాట్సాప్ సాయంతో ఆన్‌లైన్‌లోనే ఇంటికి సరుకులు ఆర్డర్ ఇచ్చి డెలివరీ పొందొచ్చు. ఫేస్‌బుక్, రిలయన్స్ డీల్స్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పరుగులు పెట్టాయి. దీంతో అంబానీ సందప విలువ పెరిగింది
 

Related Posts