YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లాక్ డౌన్ ఉన్నా పూర్తి చెల్లింపులు

లాక్ డౌన్ ఉన్నా పూర్తి చెల్లింపులు

లాక్ డౌన్ ఉన్నా పూర్తి చెల్లింపులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23
కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కొనసాగుతోంది. రెండో దశ లాక్‌డౌన్ మే 3న ముగియనుంది. లాక్‌డౌన్ కారణంగా ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేశారు. దేశంలో కీలకమైన రైల్వే సేవలు కూడా నిలిచిపోయాయి. కేవలం సరుకు రవాణా మినహా అన్ని ప్యాసింజర్ రైళ్లు మార్చి 25 నుంచి నిలిచిపోయాయి. మార్చి 25 నుంచి మే 7 వరకు ప్యాసింజర్ సర్వీసులను రైల్వే శాఖ నిలిపివేయడంతో ఆదాయానికి భారీగా గండిపడింది. నిత్యం దేశవ్యాప్తంగా లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే రైళ్లు.. ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల్లో రైల్వే శాఖ కోత విధించనుందనే ప్రచారం సాగుతోంది. అయితే, దీనిని రైల్వే శాఖ వర్గాలు తోసిపుచ్చాయి.ఏప్రిల్ నెలకు సంబంధించి పూర్తి వేతనం ఉద్యోగులకు చెల్లిస్తామని దక్షిణ మధ్య రైల్వే భరోసా ఇచ్చింది. శాశ్వత, కాంట్రాక్ట్ పద్దతితో పనిచేసే అందరికీ పూర్తిస్థాయి జీతాలు చెల్లిస్తామని, ఎలాంటి కోతలు విధించబోమని స్పష్టం చేసింది. ‘రైల్వే ఉద్యోగులందరికీ మార్చి నెలకు సంబంధించి జీతాలు పూర్తిగా చెల్లించాం.. జాతీయ రవాణాదారు అయినందున లోకో పైలట్లు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగుల జీతభత్యాలను తగ్గించే ఆలోచన మాకు లేదు. ఒకవేళ చెల్లింపుల్లో జాప్యం లాంటి ఏమైనా సమస్యలు ఉంటే, వ్యక్తిగత స్థాయిలో వాటిని పరిష్కరిస్తున్నాం’ అని దక్షిణ మధ్య రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్ చీఫ్ సీహెచ్ రాకేష్ వెల్లడించారు.ఇదిలా ఉండగా.. లాక్‌డౌన్ సమయంలో కేవలం తొమ్మిది రోజుల్లో 1,507 టన్నుల పర్సిల్స్‌ను దక్షిణ మధ్య రైల్వే రవాణా చేసింది. దేశంలోని అన్ని జోన్‌లలో ఇది రెండో అత్యధికం. కాగా, లాక్‌డౌన్ మే 3 వరకు కొనసాగనుండగా.. ప్యాసింజర్ సర్వీసులపై రైల్వే శాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొన్ని మీడియాల్లో వస్తున్న పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేసింది. లాక్‌డౌన్ ముగిసి రైలు సర్వీసులు ప్రారంభమైన తర్వాత వైరస్ ప్రభావం లేని ప్రాంతాలకు మాత్రమే ప్రత్యేక రైళ్లను నడపాలనే ఆలోచనలో రైల్వే శాఖ ఉంది. వైరస్ వ్యాప్తి చెందకుండా త్రీ-టైర్ కోచ్‌లలోని మిడిల్ బెర్త్‌ను తొలగించి, అన్-రిజర్వ్‌డు ప్రయాణాలను అనుమతించరాదని భావిస్తోంది.
 

Related Posts