అర్నాబ్ గోస్వామిపై దాడిని ఖండించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ ఏప్రిల్ 23
రిపబ్లిక్ టివి వ్యవస్థాపకుడు అర్నబ్ గోస్వామి జరిగిన దాడిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో ఆయన, ఆయన భార్య స్టూడియో నుంచి బుధవారం రాత్రి కారులో ఇంటికి వస్తుండగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడి ఘటనపై కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు.దాడికి పాల్పడిన దుండగులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను ఆదేశించినట్టు కిషన్ రెడ్డి తెలిపారు. ఇది వాక్ స్వాతంత్ర్యం, భావ స్వాతంత్ర్యంపై జరిగిన దాడిగా భావిస్తూ ఖండిస్తున్నాం. తక్షణ చర్యలు చేపట్టాలని ముంబై పోలీసులను ఆదేశించాను” అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.