ఇది ఆర్థిక ఎమర్జెన్సీ కాదు
న్యూఢిల్లీ ఏప్రిల్ 24
ముంబైలో పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. మర్కజ్ సంఘటన వల్లే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. మూడవ విడత లాక్ డౌన్ పొడిగింపు మే 3న ఆ తర్వాతే నిర్ణయిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హెలిక్యాప్టర్ ఫండ్, ఇప్పట్లో లేదు, ఏదో ఓ రాష్ట్రం కోరితే ఇచ్చేది కాదు. అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు కలిసితీసుకోవలసిన నిర్ణయమని అయన అన్నారు.ప్రస్తుతం హెల్త్ ఎమర్జెన్సీ మాత్రమే. ఆర్థిక ఎమర్జెన్సీ కాదు. వలస కార్మికుల రక్షణ కు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏ రాష్ట్రాల వారు తమ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలను రాష్ట్రాల్లోకి అనుమతించే పరిస్థితుల్లో లేరు. ఏ ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అక్కడే ఉండి స్లమ్స్ కట్టడి చేసుకోవాలి. ఇప్పటికే వలస కార్మికులకు 12 వేల కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. జన సాంద్రత ఎక్కువ ఉన్న దేశాల్లోనే అధిక మరణాలు సంభవిస్తున్నాయి. మనదేశంలో జనసాంద్రత ఎక్కువ కనుక మరింత అప్రమత్తంగా ఉండాలని అయన అన్నారు.