YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
నలుగురు అరెస్ట్
హైదరాబాద్ ఏప్రిల్ 24
కరోనా లాక్డౌన్ వేళ హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ మానసిక వికలాంగురాలిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఓ మతిస్థిమితం లేదని బాలిక ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా.. అదే ప్రాంతానికి చెందిన అక్బర్, జుమన్, గయాజ్,  అలీంలు ఆమెను వెంటాడుతూ వెళ్లారు. చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించి.. ఆ యువతిని దగ్గర్లోని ఒక పురాతన  భవనంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి దాటిన  తరువాత బాలికకు ఫోన్ ఇచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. దీంతో కంగారుపడిన వారు దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక నుంచి వచ్చిన ఫోన్కాల్ ఆధారంగా గాలింపు  చేపట్టి.. రెండు గంటల తరువాత దేవేందర్నగర్లో బాలికను గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన నిందితులు అక్కడి నించి పరారయ్యేందుకు ప్రయత్నించగా.. ఒకరిని అదుపులోకి  తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో మిగిలిన ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు
 

Related Posts