కొవిడ్-19పై భారతీయ పోరాటం
ఇమ్యునోమాడ్యులేటర్ సెప్సివాక్ అభివృద్ధికి సిఎస్ఐఆర్ నిర్ణయం
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 24
కొవిడ్-19 లేదా మరే అంటురోగంపై అయినా పోరాడటానికి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ కీలక పాత్రను పోషిస్తుంది. ఈ వైరస్లను గుర్తించడానికి మరియు తొలగించడానికి అత్యంత వేగవంతమైన మరియు తొట్టతొలి సామర్థ్యం శరీరంలోని రోగనిరోధక వ్యవస్థదే. కొవిడ్-19 లేదా మరే ఇతర వైరస్లైనా ఏ వ్యక్తికైనా సోకకపోవడానికి లేదా నామమాత్రంగా సోకడానికి కారణం అతనిలో వాటిని తట్టుకునేందుకు సరిపడినంత రోగనిరోధక శక్తి ఉండటం. శరీరంలోని మైక్రోగ్రాఫ్లు మరియు ఎన్కే కణాలు ఈ రక్షణను ఇస్తాయి. ప్రపంచమంతా కొవిడ్-19కు వ్యాక్సిన్ను మరియు వైరస్ నిరోధక కారకాన్ని కనుగొనే పనిలో ఉండగా సాంకేతిక మరియు పరిశ్రమల పరిశోధనా మండలి(సిఎస్ఐఆర్) వైరస్ సోకిన రోగి త్వరగా కోలుకునేందుకు ఆ వ్యక్తి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆమోదించిన రోగనిరోధక శ్రుతిమిశ్రకం(ఇమ్యునోమాడ్యులేటర్) సెప్సివాక్®ను అభివృద్ధి చేసేందుకు తన ప్రతిష్టాత్మక కార్యక్రమం న్యూ మిలీనియం ఇండియన్ టెక్నాలజీ లీడర్షిప్ ఇనీషియేటివ్ కార్యక్రమం క్రింద సన్నాహాలు చేస్తోంది. సెప్సివాక్® ద్వారా ఆశిస్తున్న లక్ష్యాలు: 1. కొవిడ్-19 రోగులకు దగ్గరగా మసిలిన వ్యక్తుల మరియు వైద్యసంబంధిత వృత్తిలో ఉన్న సిబ్బందికి వారి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా ఈ అంటువ్యాధి నుండి రక్షించడం. 2. కొవిడ్-19 వలన ఆసుపత్రిపాలైన, రోగ తీవ్రత తక్కువగా ఉన్న రోగులను త్వరితంగా కోలుకునేలా చేయడంతోపాటు ఐసియులో ఉన్న రోగి వలన ఈ వైరస్ వ్యాప్తిని ఆపడానికి ఈ ప్రయత్నం సహకరిస్తుంది. క్రొత్తగా చేస్తున్న ఈ ప్రయోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి(డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డిసిజిఐ)) వారి ఆమోదం ఉండగా , రాండమైజ్డ్, డబుల్-బ్లైండ్, టు-ఆర్మ్, నియంత్రిత ప్రయోగ పరీక్షలను ఇందులో నిర్వహించబడతాయి. ఈ రెండు పరీక్షలను ఇప్పటికే ప్రకటించిన ప్రయోగాత్మక పరీక్షలకు అదనంగా కొవిడ్-19 తీవ్రత ఎక్కువగా ఉన్న రోగుల్లో మరణాల రేటును తగ్గించే సామర్థ్యాన్ని పరీక్షించడానికి నిర్వహిస్తారు. సెప్సివాక్® వేడితో చంపబడే సూక్ష్మజీవులను డబ్ల్యూ(ఎండబ్ల్యూ)ను కలిగి ఉంటుంది. ఇవి రోగి శరీరంలో ఉండటం వలన రక్షణతోపాటు వీటి వినియోగం వలన ఎటువంటి ఇతర ప్రభావాలు కలుగవు. ఈ సెప్సివాక్ ను ఎన్ఎంఐటిఎల్ఐ కార్యక్రమం క్రింద సిఎస్ఐఆర్ అభివృద్ధి చేయగా అహ్మదాబాదుకు చెందిన కడిలా ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ తయారు చేస్తుంది.