YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ఖమ్మం డీసీసీ అధ్యక్షులు సత్యం మృతి

ఖమ్మం డీసీసీ అధ్యక్షులు సత్యం మృతి

ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆయితా సత్యం శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందారు. సత్యం గత కొంత కాలంగా కాన్సర్ వ్యాధితో బాధ పడుతూ హైద్రాబాద్ లోని మెక్సికేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సత్యం మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షులు భట్టి విక్రమార్క, నాయకులు మల్లు రవి తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అయన మరణ వార్త తెలియగానే టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ వరంగల్ నుంచి ఖమ్మం బయలుదేరి వెళ్లారు. భట్టి విక్రమార్క కూడా ఖమ్మం వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ నాయకుని పార్టీ కోల్పోయింది. క్రమశిక్షణ గల నాయకులు, పార్టీ కోసం నిరంతరం తపించారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేసారు.

Related Posts