చిన రాజప్ప నిరాహార దీక్ష
రాజమండ్రి ఏప్రిల్ 25
తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేటలోని తన నివాసంలో మాజీ హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప 12 గంటల నిరాహారదీక్ష కు దిగారు. కరోనా విపత్తు కారణంగా ప్రతీ పేద కుటుంబానికి 5వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేసారు. మూసివేసిన అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమాను పునరుద్ధరించాలి. సెరి కల్చర్, ఆక్వా కల్చర్, పౌల్ట్రీ రంగాలను ఆదుకోవాలని అయన అన్నారు. - కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర అధికారులకు రక్షణ కిట్లు అందించాలని అయన అన్నారు.