YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వం విఫలమయింది

ప్రభుత్వం విఫలమయింది

ప్రభుత్వం విఫలమయింది
విజయవాడ ఏప్రిల్ 25
కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఎపి లో నాలుగు జిల్లాల్లో 70శాతం కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఈ జిల్లాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. సామాజిక వ్యాప్తి పెరిగిపోతున్నా.. ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. వైసిపి ఎమ్మెల్యే లు, మంత్రులు లాక్ డౌన్ నిబంధనలు పట్టించుకోవడం లేదు. మాకు మాత్రం నోటీసులు ఇచ్చి కూడా విరమించుకున్నారు. హెల్త్ బులెటిన్ లో కూడా అనేక లోపాలు ఉంటున్నా.. సరి దిద్దుకోవడం లేదు. కర్నూలు లో ఒక వైద్యుడు చనిపోతే.. తొలుత నెగిటివ్ అన్నారని అయన అన్నారు. తర్వాత పాజిటివ్ గా నిర్ధారించినా.. అప్పటికే పరిస్థితి మారిపోయింది. పవిత్రమైన రంజాన్ మాసంలో దాతలు భోజనం పంపిణీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఇది సరైంది కాదు.. దీని పై పునరాలోచన చేయాలని అయన అన్నారు. లౌడ్ స్పీకర్ కు అనుమతి ఇవ్వడం ద్వారా.. అన్ని ప్రాంతాలలో కరోనా జాగ్రత్తలు పాటించేలా సూచనలు చేయాలి. ఎపి జాలర్లను కాపాడేందుకు గుజరాత్ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషం. వైసిపి నేతలు.. ప్రభుత్వం వేరు.. పార్టీ వేరు అనేది గుర్తించాలి. సేవ పేరుతో వందల మందితో ర్యాలీ చేయడం.. జన సమూహం తో తిరగడం సరి కాదు. జిల్లా ఇన్ ఛార్జి మంత్రులను ఆయా జిల్లాలకు పంపి.. పరిస్థితి పర్యవేక్షణ చేసేలా చూడాలి. రైతుకు ఎకరాకు 25వేల రూపాయల సాయం అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. ఇతర రాష్ట్రాలలో పంటలు విక్రయించే బాధ్యత తీసుకోవాలి. రైతు సమస్యలు పరిష్కారం లో సిఎం ప్రత్యేకంగా సమీక్ష చేయాలని అయన అన్నారు. కరోనా సమయంలో కూడా సిఎం జగన్ ఎన్నికల గురించి ఆలోచన చేయడం దుర్మార్గం. ఆరు నెలల పాటు ఎన్నికలు ఉండవని ప్రకటన చేయాలి. ఈ ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం ఎక్కువ.. ఆచరణ తక్కువ. కోవిడ్ 19 విషయంలో కేంద్రం సూచనలు రాష్ట్రం ఆచరించాలి. పెరుగుతున్న కేసుల దృష్ట్యా.. ల్యాబ్ ల సంఖ్య పెంచాలి. రాష్ట్రం లో కొన్ని ప్రవేట్ ఆసుపత్రి లో అయినా అత్యవసర కేసులు చూసేలా ఆదేశించాలి. ఎన్నికల కమిషనర్ వివాదం హైకోర్టు పరిశీలనలో ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుంది. వైసిపి ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీకులు ఇస్తుంది. ఎపి లో అధికార పార్టీ లకు ఒక చట్టం.. విపక్షాలకు మరో చట్టం అన్నట్లుగా ఉంది. నెహ్రూ యువజన కేంద్రం జాతీయ వైస్ ఛైర్మన్ గా నేను ఉన్నాను. ఎమర్జెన్సీ కోటా కింద నేను అన్ని ప్రాంతాలలో పర్యటిస్తున్నని వివరించారు. ఎపి లో నేను అతిధిగా ఉన్నాను.. సామాజిక దూరం పాటించి పనులు చేస్తున్నాను. కరోనా విధుల్లో పాల్గొంటున్న జర్నలిస్టు లకు యాభై లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. వైసిపి నేతల నిర్లక్ష్యం వల్లే చాలా ప్రాంతాలలో కరోనా కేసులు పెరగటం వాస్తవం. కారకులైన వారందరి పైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ప్రభుత్వం ఉద్యోగులు, పోలీసులు, వాలంటీర్ లకు వచ్చింది. మీడియా వాస్తవాలు చెబితే.. కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. కరోనా వ్యాప్తి కి ఇప్పటికైనా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని అయన అన్నారు. ఈ సమావేశంలో జాతీయ మైనార్టీ మోర్చా కార్యదర్శి షేక్ బాజి,మీడియా కన్వీనర్ వుల్లూరి గంగాధర్,కదిరి అసెంబ్లీ కన్వీనర్ ఎస్.వి.నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
 

Related Posts