YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అక్బరుద్దీన్ కు శాపం పెడతారా : రాములమ్మ ప్రశ్న

అక్బరుద్దీన్ కు శాపం పెడతారా : రాములమ్మ ప్రశ్న

అక్బరుద్దీన్ కు శాపం పెడతారా : రాములమ్మ ప్రశ్న
హైద్రాబాద్, ఏప్రిల్ 25
తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్, సినీ నటి విజయశాంతి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి తనదైన శైలిలో విమర్శించారు. గతంలో కరోనాపై జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో సీఎం కేసీఆర్ గాంధీ ఆస్పత్రిలో సౌకర్యాలు లేవని ప్రచారం చేసిన వారికి కరోనా రావాలని చేసిన తీవ్ర వ్యాఖ్యలను విజయశాంతి గుర్తు చేశారు. ఇటీవల ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కూడా గాంధీ ఆస్పత్రి జైలు లాంటిదని అన్నారని విజయశాంతి తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు. వ్యతిరేక ప్రచారం చేసిన వారికి కరోనా రావాలన్న కేసీఆర్.. మరి అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఆయనకు ఏం శాపం పెడతారో అని ఎద్దేవా చేశారు. వారికి శాపం పెట్టినట్లే అక్బరుద్దీన్‌పై వ్యవహరిస్తారా? లేక చూసీ చూడకుండా సర్దుకుపోతారా? అనే విషయాన్ని వేచి చూడాలని విమర్శించారు.విజయశాంతి తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఈ విధంగా రాశారు. ‘‘కరోనా పాజిటివ్ కేసులుగా నిర్ధారణ అయిన వారికి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న తీరుపై ఎంఐఎం శాసనసభ సభ్యుడు అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. ప్రపంచమంతా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో.. కొన్ని లోపాలున్నా... వాటిని పట్టించుకోకుండా అందరూ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఈ మధ్య ప్రెస్ మీట్‌లో స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవని రాసినవారికి కరోనా రావాలని కేసిఆర్ గారు శాపం పెట్టారు.’’‘‘వైద్య సదుపాయాలు లేవు అన్నందుకే కరోనా రావాలన్న కేసీఆర్ గారు.. మరి గాంధీ ఆసుపత్రి జైలు మాదిరిగా ఉందని విమర్శించిన అక్బరుద్దీన్ గారిపై ఎలాంటి శాపనార్థాలు పెడతారోననీ తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు. గాంధీ ఆసుపత్రి జైలు లాగా ఉందని విమర్శించిన అక్బరుద్దీన్ గారికి బహుశా కేసిఆర్ గారు పెట్టిన శాపం గురించి తెలిసి ఉండకపోవచ్చు. లేదా కేసీఆర్ గారు.. తాను ఒకటే కనుక ఈ శాపాలు తనకు వర్తించవని అక్బరుద్దీన్ గారిలో ధీమా ఉండి ఉండొచ్చు... లేదా మాకు ఈ శాపాలు తగలవని... తాము అన్నిటికీ అతీతమని అక్బరుద్దీన్ గారు భావించి ఉండొచ్చు. మరి రాబోయే రోజుల్లో అక్బరుద్దీన్ కామెంట్స్‌పై కేసిఆర్ గారు శాపం పెడతారా? లేక చూసీ చూడకుండా సర్దుకుపోతారా? అనే విషయాన్ని వేచి చూడాలి.’’ అని విజయశాంతి సూటిగా విమర్శలు చేశారు.

Related Posts