భారీగా పెరిగిన బంగారం, వెండి అక్షయ తృతీయ ఇచ్చిన షాక్..
అక్షయ తృతీయ అదునుగా బంగారం ధర ఆకాశాన్ని తాకింది. ఈరోజు భారీగా పెరిగింది. పసిడి బాటలోనే వెండి ధర కూడా నడిచింది.హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.510 పెరుగుదలతో రూ.45,810కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఏకంగా రూ.840 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.42,500కు ఎగసింది అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పరుగులు పెట్టింది. వెండి ధర మాత్రం బంగారం ధర కొండెక్కి కూర్చుంది. పరుగులు పెడుతూనే వస్తోంది. ఈ రోజు కూడా బంగారం ధర భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరుగుదల కారణంగా మన దేశంలోనూ పసిడి ధర పైకి కదిలిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు బంగారం ధర పెరిగితే వెండి ధర ఇదే దారిలో నడిచింది.