కేంద్ర ఆరోగ్య బృందానికి సహాయ నిరాకరణ.. సూచనలను పట్టించుకోని మమత పశ్చిమబెంగాల్ దారే వేరు
కేంద్రంపై మమత అలకతో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సహాయనిరాకరణ చేస్తోందని కోవిడ్–19 ప్రభావాన్ని అంచనా వేసేందుకు వచ్చిన రెండు కేంద్ర బృందాలు విమర్శించాయి. కోల్కతా, సిలిగురిలో పర్యటిస్తోన్న బృందానికి అవసరమైన సమాచారం అందించడంలోనూ, ప్రభుత్వం నుంచి ఎదురైన సహాయనిరాకరణపై రెండు కేంద్ర బృందాలు ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ సిన్హాకి లేఖలు రాశాయి. ఇప్పటి వరకు నాలుగు లేఖలు రాశామనీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదని కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తోన్న సీనియర్ అధికారి అపూర్వ చంద్ర చెప్పారు. కేంద్ర బృందం రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించే స్వేచ్ఛ ఉందనీ, అయితే వారితో కలవడం వల్ల తమ సమయం వృథా అవుతుందనీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. లాక్డౌన్ని కఠినంగా అమలుచేయాలని స్పష్టం చేశాయి.