YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

అరబ్ దేశాల్లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులను స్వదేశానికి తీసుకురండి

అరబ్ దేశాల్లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులను స్వదేశానికి తీసుకురండి

అరబ్ దేశాల్లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులను స్వదేశానికి తీసుకురండి
   విదేశాంగ మంత్రికి ఎంపి, బండి సంజయ్ లేఖ
హైదరాబాద్ ఏప్రిల్ 27
తెలంగాణలోని కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి వర్గంతో పాటు, సమీప నియోజక వర్గాల ప్రజలు, చాలా మంది అరబ్ దేశాలకు భారీగా వలస వెళ్లారు. అక్కడ వేలాది మంది ప్రజలు వివిధ స్థాయిలలో పనిచేస్తున్నారు. కానీ ఎక్కువ మంది మాత్రం కూలి పనులు చేస్తున్నారు. అరబ్ దేశాల్లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన కార్మికులను స్వదేశానికి తీసుకురావడానికి, అరబ్ దేశాలకు ప్రత్యేక విమానాలను పంపే ప్రయత్నాలను వేగవంతం చేయాలని, కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం ఎంపి, బిజెపి రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ కుమార్  విజ్ఞప్తి చేదారు. ఈ మేరకు నేడు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కు లేఖ రాశారు.ఈ వలసకు నాలుగు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది.కరోనా వ్యాధి వ్యాప్తి తరువాత, లాక్డౌన్ ప్రకటించిన కారణంగా, అక్కడ ఎక్కువ మంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు లేదా పని లేకుండా ఖాళీగా ఉన్నారు. భారతదేశంలో లాక్ డౌన్ ప్రకటన తర్వాత మార్చి 22 నుండి అంతర్జాతీయ విమానాల నిషేధం పర్యవసానంగా, వారు భారతదేశానికి తిరిగి రాలేకపోయారు. అక్కడ నెలకొన్న దారుణమైన పరిస్థితుల గురించి బాధపడుతూ,  చిక్కుకున్న ప్రజలు , చాలా మంది ఫోన్ చేసి, బాధ పడ్డారు. ఇంకా, వారిలో కొందరికీ కరోనా (సుమారు 12 మంది) ఉన్నట్లు గుర్తించారు. హిందూ పత్రికలో ఈ విషయాలు స్పష్టంగా చెప్పారు. నివాసయోగ్యం కానీ, ప్రదేశాలలో కార్మికులను ఉంచడం తో, వారి పరిస్థితి దయనీయంగా ఉందని, వారు ఆవేధన వ్యక్తం చేశారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఆ కార్మికుల కుటుంభ సభ్యులు, తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కార్మికుల గురించి విషయాలు బయటపడుతున్న కొద్ది, వీరు ఆందోళన చెందుతున్నారు.ఒక పార్లమెంటు సభ్యునిగా, తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా, ఈ విషయాలు మీ దృష్టికి తీసుకురావడం, మీ సహాయం కోరడం నా బాధ్యత.  కరోనా వ్యాధి వ్యాప్తి తీవ్రత బట్టి, అంతర్జాతీయ ప్రయాణాలు ప్రారంభం కావడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాదు కాబట్టి, ఈ పరిస్థితులలో, అరబ్ దేశాల్లో చిక్కుకున్న కార్మికులను, స్వదేశానికి తీసుకువచ్చే మార్గాలను అన్వేషించి, వారిని త్వరగా తిరిగి తీసుకువచ్చేలా వ్యూహాన్ని రూపొందించండి.అంతేకాకుండా, భారతదేశంలోని ముస్లింల పట్ల శత్రుత్వం ఉందని ఆరోపిస్తూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ నిరాధారమైన ప్రకటన విడుదల చేయడం మీకు తెలుసు. ఇది అరబ్ దేశాల్లో ఉన్న కార్మికుల జీవితాలను మరింత ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Related Posts