తెరాస ఆవిర్భావ దినోత్సవం..రక్తదాన శిబిరాలు
హైదరాబాద్ ఏప్రిల్ 27
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెరాస పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని లేక్ వ్యూ బంజారా గార్డెన్ లో రక్త దాన శిబిరం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్, రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి . శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల పరిధిలోని ఔషపూర్ టి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, లాక్ డౌన్ నేపథ్యంలో తినడానికి తిండి లేక చేయడానికి పని లేక ఇబ్బంది పడుతున్న వలస కూలీలకు ,పేద ప్రజలకు కార్మిక ,ఉపాధి శాఖ మంత్రి చమకూర మల్లరెడ్డి బియ్యం, పప్పు, నూనె, చింతపండు పలు రకాల నిత్యావసర వస్తువులను సామాజిక దూరాన్ని పాటిస్తూ పేద ప్రజలకు అందించారు. మంత్రి మాట్లాడుతూ ఈ విపత్కర పరిస్థితులలో పేద ప్రజలను ఆదుకోవడానికి తమకు తోచిన విధంగా మానవతా దృక్పథంతో దాతలు ముందుకు రావాలని కోరారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరాన్ని పాటిస్తూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరి ఇంటి నుండి బయటకు రావద్దని అందరూ ఐకమత్యంగా ఉండి కరోనా ను తరిమికొడదాం అని ఈసందర్భంగా ఆయన తెలిపారు