YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

30 ఇయర్స్ ఇండస్ట్రీ హాట్ కామెంట్

30 ఇయర్స్ ఇండస్ట్రీ హాట్ కామెంట్

30 ఇయర్స్ ఇండస్ట్రీ హాట్ కామెంట్
హైద్రాబాద్, ఏప్రిల్ 27
 సినీ నటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నేత పృధ్వీ రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన టిక్ టాక్ వీడియో విడుదల చేశారు. కల్తీ నా కొడుకులు ఏలుతున్న కలియుగమిది అంటూ హాట్ కామెంట్ చేశారు. మన అనే ఎవరినీ నమ్మవద్దని, జాగ్రత్తగా ఉండన్నా అంటూ హితవుపలికారు.‘అన్న.. మన అనే ఎవరినీ నమ్మవద్దు. ఎందుకంటే ఇది తాతలనాటి యుగం కాదు. కల్తీ నా కొడుకులు ఏలుతున్న కలియుగం. మన ముందు మన మాట.. వాళ్ల ముందు వాళ్ల మాట మాట్లాడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండన్నా’’ అంటూ పృధ్వీ రాజ్ వ్యాఖ్యానించారు. కాగా, ఓ ఆడియో టేప్ వివాదంలో చిక్కుకున్న పృధ్వీ రాజ్.. ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే శ్రీవేంకటేశ్వరస్వామి వారి సాక్షిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని పృధ్వీ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. తనను కావాలనే ఈ వివాదంలోకి లాగి, అల్లరిపాలు చేశారని వాపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా, టిక్ టాక్ వీడియో చేసిన పృధ్వీ ఏ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు అనేది చర్చనీయాంశమవుతోంది. అయితే పృధ్వీ రాజ్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు.

Related Posts