YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం విదేశీయం

మ్యాట్రిక్స్ సంస్థపై విచారణ షురూ

మ్యాట్రిక్స్ సంస్థపై విచారణ షురూ

మ్యాట్రిక్స్ సంస్థపై విచారణ షురూ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27
వేగంగా కరోనా వైరస్‌ను నిర్ధారించే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్‌ల కోసం ప్రస్తుతం డిమాండ్ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. దీనిని కొందరు సొమ్ము చేసుకుంటున్నాయి.దేశంలో కరోనా వైరస్ పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్‌ల కొనుగోలుకు కేంద్రం అనుమతించింది. రాష్ట్రాలే వీటిని నేరుగా కొనుగోలు చేసేలా వీలు కల్పించడంతో పలు ఫార్మా కంపెనీలు దీనిని అవకాశంగా తీసుకుని సొమ్ము చేసుకున్నాయి. తక్కువ ధరకు చైనా నుంచి కొనుగోలుచేసి.. దానికి రెట్టింపు కంటే ఎక్కువ ధరకు కట్టబెట్టాయి. ఓ సంస్థ తక్కువ ధరకే కిట్ కొనుగోలు చేసి, అధిక ధరకు అమ్మిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. మ్యాటిక్స్ ఫార్మా కంపెనీ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్‌ ఒక్కోదాన్ని చైనా నుంచి రూ. 245కు కొనుగోలు చేసింది.దాని ధరను రూ. 600కు పెంచేసి, కేంద్రం, పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు పంగనామాలు పెట్టింది. ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో ధరను వసూలు చేయడంతో దీని నిర్వాకం బయపడింది. మ్యాట్రిక్స్ నుంచి కిట్లను పొందిన డీలర్ సంస్థ రియల్ మెటాబాలిక్స్, ఆర్ ఫార్మాస్యుటికల్స్‌లు ఈ నిర్వాకానికి పాల్పడి, కేంద్రాన్ని మోసం చేశారు.మాట్రిక్స్ నుంచి టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసిన మరో డీలర్ షాన్ బయోటెక్.. తమిళనాడు ప్రభుత్వానికి వీటిని అమ్మడంతో వివాదం బయటపడింది. తమతో ఒప్పందం కుదుర్చుకున్న మ్యాట్రిక్స్.. నిబంధనలకు విరుద్ధంగా షాన్ బయోటెక్‌కు టెస్టింగ్ కిట్లను విక్రయించిందని రియల్ మెటబాలిక్స్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో గుట్టురట్టయ్యింది.ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు.. ఇరు వర్గాలు వాదనలు విని ఏప్రిల్ 24న తీర్పును వెలువరించింది. వివాదంతో మంచే జరిగిందని, మహమ్మారి కారణంగా ప్రపంచం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ప్రైవేటు వ్యక్తులు లాభాపేక్ష తగ్గించుకోవాలని సూచించింది. వాస్తవ ధర రూ.245, జీఎస్టీతో సహా మిగతా పన్నులు రూ.155తో కలిపి ఒక్కో టెస్టింగ్ కిట్ ధర రూ. 400కు మించరాదని ధర్మాసనం ఆదేశించింది. ఒప్పందం వివాదాన్ని పక్కనబెట్టి, ప్రతి పంపిణీదారుడు కేసును చర్చించి పరిష్కరించుకుని, ప్రజలకు మేలు చేయాలని సూచించింది.కాగా, చైనాకు చెందిన వాండ్ ఫో సంస్థ తయారు చేసిన ఈ కిట్లను భారత ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు కొనుగోలు చేశాయి. ఒక్కో రాష్ట్రం ఒక్కో ధరపై వీటిని కొనుగోలు చేయగా, ఇప్పుడు ఏ కిట్ కు అయినా గరిష్ఠంగా రూ. 400 ధర మించరాదని హైకోర్టు ఆదేశించింది. టెస్టింగ్ కిట్లను అధిక ధరకు విక్రయించిన విషయమై ఐసీఎంఆర్ ఇంకా స్పందించలేదు.

Related Posts