YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

*శ్రీ రామకృష్ణ పరమహంస గారు చెప్పిన ఒక చిన్న సంఘటన..

*శ్రీ రామకృష్ణ పరమహంస గారు చెప్పిన ఒక చిన్న సంఘటన..

*శ్రీ రామకృష్ణ పరమహంస గారు చెప్పిన ఒక చిన్న సంఘటన...
కాళీమాత ఆలయం లో ఓ రోజు ప్రసాదం గా ఇవ్వడానికి లడ్డూ తయారు చేస్తున్నారు. అయతే ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు లడ్డూ కి చీమలు పట్టడం మొదలైంది. లడ్డూ తయారు చేస్తున్న వారి కి ఏం చేయాలో తెలీలేదు. "చీమలను చంపకుండా ఎలా?"అని ఆలోచనలో పడ్డారు. అప్పుడాయన చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి. వాటిని తీసుకుని చీమలు వెళ్ళిపోతాయి.ఇక ఇటు రావు అని సూచించారు. పరమహంస చెప్పినట్లే చీమలొచ్చే దారి లో చక్కెర పొడి చల్లారు.ఆ పొడి ని చూడటం తోనే వాటిని నోట కరుచుకుని చీమలు కాస్సేపటికల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి.సమస్య కొలిక్కి వచ్చింది.ఈ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు ఇలా అన్నారు."మనుషులూ ఈ చీమల్లాంటి వారే. తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటూనే తమకు తెలియకుండానే దానిని మధ్య లోనే విడిచి పెట్టి మరొకటేదైనా దారి లో కనిపిస్తే దాని తో సరిపెట్టుకుంటారు, తప్ప ముందనుకున్న లక్ష్యాన్ని విడిచిపెడతారు...." అని చెప్పారు.తమకు కావలసింది చక్కెర కాదు లడ్డూ పొడేనని ఒక్క చీమా ముందుకు రాలేదు.మనం కూడా అలానే భగవంతుడు సర్వస్వమ్ అనుకొనే సాధన మొదలు పెడతాము.మధ్యలో ఎవరో ఎదో చెపితే దాని వద్దకు వెళ్లి మన సాధన అంత వృధా చేసుకొంటాము.తీయగా ఉందన్న చక్కెర తో సరిపెట్టుకుని వెళ్ళిపోయాయి చీమలు.రవ్వంత చక్కెర సంతోషం చాలనుకున్నాయవి.లడ్డూ అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునే వారు చాలా తక్కువ మందే అని పరమహంస చెప్పారు.

లోకా సమస్తా సుఖినోభవంతు

వరకాల  మురళి మోహన్ సౌజన్యంతో

Related Posts