YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

రైతు కంట కన్నీరు

రైతు కంట కన్నీరు

రైతు కంట కన్నీరు
ఖమ్మం, ఏప్రిల్ 28
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షం రైతులకు కన్నీళ్లు తెప్పించింది. కల్లాల్లో ఉన్న యాసంగి వరి పంట భారీ వర్షానికి తడిసి ముద్దయింది. ఇంకా కోయాల్సిన పంట నేలకొరిగింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వరికోతలు, ధాన్యం అమ్మకాలు కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 80 శాతం మేర వరి కోతలు పూర్తయ్యాయి. అయితే 50 శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద, కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు జోరువాన లోనూ రైతులు నానా పాట్లు పడ్డారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 7వేల ఎకరాలలో పండించిన పంట వర్షార్పణం అయింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి సైతం వర్షానికి తడిసింది.ఉధృతమైన గాలులతో మామిడి, బొప్పాయి కాయలు నేలరాలాయి. జిల్లాలో సుమారు 500 ఎకరాలలో మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. లక్ష్మీపురం గ్రామంలో యారం లక్ష్మీరెడ్డి అనే రైతు సాగుచేసిన బొప్పాయి తోట పూర్తిగా నేలమట్టమయింది. దీంతో రూ.6 లక్షల నష్టం వాటిల్లింది. పంట నష్టాన్ని అంచనా వేయాలని కలెక్టర్‌ ఎం.వి.రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో వారు  క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నష్టం అంచనా నివేదికలను సిద్ధం చేశారు. అకాల వర్షంతో సుమారు 1000 ఎకరాల్లో వరిపంట నేలకొరిగిందే తప్ప నష్టం జరగలేదని అధికారులు అంచనా వేశారు. ఉద్యావవన పంటలైన మామిడి, బొప్పాయికి మాత్రం నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. కల్లాలో తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకుంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా కల్పిస్తున్నారు. కల్లాల్లో ధాన్యం కూడా 30 శాతం మాత్రమే తడిసిందని అంటున్నారు. మరో రెండు, మూడు రోజుల పాటు వర్షం పడే సూచనలు ఉండటంతో టార్పాలిన్లు, పరదాలు అందుబాటులో ఉంచుకుని ధాన్యం, మిర్చి పంటలను కాపాడుకోవాలని  సూచిస్తున్నారు.
 

Related Posts