YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

శివాలయంలో ఇద్దరి సాధువుల దారుణ హత్య

శివాలయంలో ఇద్దరి సాధువుల దారుణ హత్య
 

శివాలయంలో ఇద్దరి సాధువుల దారుణ హత్య
లక్నో ఏప్రిల్  28
దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనాతో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు శివాలయంలో సాధువుల హత్యలు సంచలనంగా మారాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ బులంద్షహర్లో జరిగింది. మొన్న పాల్ ఘర్ ఘటన మరువకముందే.. మంగళవారం ఉదయం యూపీలో దారుణం చోటుచేసుకుంది. బులంధర్ షాహర్ జిల్లా అనూప్ షహర్ ప్రాంతంలోని పగోనా గ్రామంలో ఒక  ఆలయంలో ఇద్దరు సాధువులను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాధువుల మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు రంగీ దాస్ (55), షేర్ సింగ్ (46). రెండు రోజుల క్రితం సాధువులతో ఘర్షణ పడిన ఒక యువకుడిని పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. సాధువుల నుంచి పటకారును  సదరు యువకుడు దొంగిలించాడని వారి మధ్య వివాదం తలెత్తినట్లు స్థానికుల సమాచారం. హత్యలను తానే చేసినట్లు యువకుడు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.  కాగా సాధువుల హత్యతో గ్రామస్థులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. అదనపు బలగాలతో పరిస్థితిని అదుపు చేస్తున్నారు పోలీసులు. ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారణకు ఆదేశించారు.

Related Posts