మంత్రి మోపిదేవి మెదడు మోకాళ్లో ఉందో... టీడీపీ నేత జవహర్
అమరావతి ఏప్రిల్ 28
మంత్రి మోపిదేవి వెంకటరమణపై టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ను నియంత్రించలేక నోటికొచ్చినట్లు మంత్రి మాట్లాడుతున్నారని, ఆయనకు మెదడు మోకాళ్లో ఉందో.. అరికాళ్లో ఉందో తెలియడంలేదన్నారు. ‘మీ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వమా? దద్దమ్మ ప్రభుత్వమా? ఏమీ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారా? మీ ఇంటిలిజెన్స్ వైఫల్యం చెందిందా?’ అని ప్రశ్నించారు. సీఎం జగన్ దోరణి ఎలా ఉందంటే.. స్థానిక ఎన్నికలు జరిపించుకుని, డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచనతో ఉన్నారని, ప్రజల బాగోగులు పట్టించుకోవడంలేదని జవహర్ విమర్శించారు.