YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నాన్నను మించిపోయావన్నా : షర్మిలా ట్వీట్

నాన్నను మించిపోయావన్నా : షర్మిలా ట్వీట్

నాన్నను మించిపోయావన్నా : షర్మిలా ట్వీట్
విజయవాడ, ఏప్రిల్ 28, (న్యూస్ పల్స్)
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ ఇవాళ మరో చారిత్రాత్మక పథకాన్ని ప్రారంభించారు. జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ సోదరి షర్మిల ట్వీట్ చేశారు. అన్నపై ప్రశంసలు కురిపించారు. ‘'నాన్న గారు ఒక అడుగు ముందుకేస్తే.. పేదవాడికి మేలు చేయడానికి నేను రెండు అడుగులు ముందుకేస్తా'నని వైఎస్ జగన్ అన్న మాటిచ్చారు.ఆ పేదవాడికి మేలు చేయడంలో తండ్రిని మించిన తనయుడిగా నిలిచారు. అన్న ప్రారంభించిన ‘జగనన్న విద్యా దీవెన’ చరిత్రలో నిలిచిపోతుంది. అంటూ షర్మిల ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా దివంగత సీఎంవైఎస్ రాజశేఖర్ రెడ్డి విద్యార్థుల చదువుల కోసం తన ప్రభుత్వంలో ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.షర్మిల ట్వీట్‌కు ముందు వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. లక్షలాది మంది విద్యార్థులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకున్నారని రోజా కొనియాడారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 12 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు పడతాయని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి సమానమైన, న్యాయమైన విద్య అందుతుందన్నారు రోజా.అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన పథకాలు ప్రవేశపెట్టిన జగన్ సర్కారు నేడు జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఒకేసారి అందజేయనున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అన్ని త్రైమాసికాలకు సంబంధించి చెల్లించవలిసిన ఫీజులు బకాయిలు లేకుండా ఒకే ఆర్థిక సంవత్సరంలో చెల్లించనున్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా తల్లులకు, వారి పిల్లల చదువుల కోసం కేవలం 11 నెలల కాలంలోనే దాదాపు రూ.12 వేల కోట్లు ప్రభుత్వం అందిస్తుంది.

Related Posts