YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఈ నెల 12న బీజేపీ ఎంపీలంతా నిరాహారదీక్ష చేపట్టండి: మోదీ

ఈ నెల 12న బీజేపీ ఎంపీలంతా నిరాహారదీక్ష చేపట్టండి: మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారని, పార్లమెంటు సమావేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలకు నిరసనగా బీజేపీ ఎంపీలంతా నిరాహారదీక్ష చేపట్టాలని ఆయన భావిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన బీజేపీ ఎంపీలంతా దీక్షకు దిగాలని, పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మీడియా ముందు చెప్పారు.  కాంగ్రెస్ మోసపూరిత రాజకీయాలకు తెరలేపిందని, కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తూ, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతోందని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో బీజేపీ ఎంపీలు, నేతలంతా నిరసన ప్రదర్శనలకు సిద్దం కావాలని ప్రధాని పిలుపునిచ్చారని ఆయన మీడియా ముందు తెలిపారు.

Related Posts