YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు...!!!

ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు...!!!

హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ఇతర నాయకులు, మహిళ నేతలు పాల్గోన్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అవతరించి 38 ఏళ్ళు నిండాయి. ఈ 38 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. బీజేపీ కార్యకర్తల కోసం ,ప్రతి సామాన్యునికి అందుబాటులో ఉండే పార్టీ అని అయన అన్నారు. ఎన్నో పార్టీలు వచ్చిన బీజేపీ కి ఓ గొప్ప వైభవం, ప్రజల కోసం మాత్రమే పని చేస్తుంది. పార్టీ పైన ఇతర పార్టీలు బురద జల్లాలని చూస్తున్నారని అయన అన్నారు. కర్ణాటకలో మే12 న జరిగే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం. ఎన్నో కుట్రలు పన్ని కర్ణాటక లో అధికారంలోకి రాకుండా చూడాలని చూస్తున్నారని అయన అన్నారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా బీజేపీ ని అభివృద్ధిని అడ్డుకోలేరు. 2019 ఎన్నికల్లో కేంద్రం లోమళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలు. ఇది ప్రపంచం లోనే గొప్ప చరిత్ర.. దేశ వ్యాప్తంగా ప్రజల మన్నన పొందింది బీజేపీ అని కొనియాడారు. మనకంటూ ఒక సిద్ధాంతం ఏర్పాటు చేసుకొని,ప్రజల శ్రేయస్సే కొనసాగుతున్నపార్టీ బీజేపీ. కేవలం ఇద్దరు ఎంపీ లునున్న పార్టీ అత్యధిక ఎంపీ లతో కేంద్రం లో అధికారంలోకి వచ్చి మోడీ నాయకత్వం పని చేయడం అంటే చాలా గొప్ప విషయమని అన్నారు. దేశంలో 21 రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చాం. ఈ నాలుగేళ్లలో దేశంలో చరిత్ర సృష్టించాం. కాంగ్రెస్ కుటుంభ పాలన ను ప్రజలు తిరస్కరించారని లక్ష్మణ్ అన్నారు. మోడీ పాలన అవినీతి లేని పాలన అందిస్తున్నారు. మోడీ అవినీతి రహిత నినాదమే కేంద్రం లో అధికారంలోకి రాగలిగామని అన్నారు.

Related Posts