తెరుచుకున్న గ్రీన్ జోన్ దుకాణాలు
బెంగళూరు ఏప్రిల్ 29,
సర్కారు అనుమతి ఇవ్వడంతో (కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలో గ్రీన్, ఆరంజ్ జోన్లు అయిన 22 జిల్లాల్లో బుధవారం నుంచి దుకాణాలు, పరిశ్రమలను ప్రారంభమయ్యాయి. బెంగళూరు, మైసూర్తో పాటు ఎనిమిది రెడ్ జోన్ జిల్లాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కేసులు తగ్గు ముఖం పడ్డడంతో గ్రీన్, ఆరంజ్ జోన్ జిల్లాల్లో దుకాణాలు, పరిశ్రమలు పునర్ ప్రారంభించాలని నిర్ణయించారు. గ్రీన్ జోన్ జిల్లాల్లోని చామరాజనగర్, హాసన్, చిత్రదుర్గ, కోలార్, చిక్కమగళూరు, దావణగెరె, హవేరీ, కొడగు, కొప్పాల్, రామనగర, రాయచూర్, శివమొగ్గ, ఉడుపి, యాదగిర్, ఆరంజ్ జిల్లాలైన బళ్లారి, మాండ్యా, బెంగళూరు రూరల్, గడగ్, తూముకూరు, చిక్కాబళ్లాపూర్, ఉత్తర కన్నడ, థార్వాడ్ జిల్లాల్లో దుకాణాలు తెరిచేందుకు అనుమతించారు. హోటళ్లు, మాల్స్, బార్లు, రెస్టారెంట్లు, సినిమాహాళ్లు, స్కూళ్లు, పాఠశాలలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.