నిమ్మగడ్డ కేసు….సోమవారానికి వాయిదా
పాస్వర్డ్ లీక్ అయిందని హైకోర్టు సీజే మండిపాటు
అమరావతి ఏప్రిల్ 29
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. నిమ్మగడ్డ తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. నిమ్మగడ్డ వేసిన పిటిషన్లపై కూడా విచారణ జరిపిన న్యాయస్థానం, ఆయన పదవీ కాలం కుదింపు వ్యాజ్యంపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇక సోమవారం నుంచి నేరుగా హైకోర్టులోనే విచారణ ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కేసుకు సంబంధించిన న్యాయవాదులను మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. ఇందుకోసం పిటిషనర్లు, న్యాయవాదులకు హైకోర్టు ప్రత్యేక పాసులు జారీ చేస్తామని, సదరు పాస్లు ఇవ్వాల్సిందిగా డీజీపీకి లేఖ రాస్తామని కోర్టు పేర్కొంది. ఈ కేసులో విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా సీజే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లోకి ఇతరులు రావడంపై మండిపడ్డారు. ఒకేసారి 40 మంది వీడియో కాన్ఫరెన్స్లోకి ఎలా వచ్చారని ప్రశ్నించారు. పాస్వర్డ్ లీక్ చేయడం వల్లే ఇలా జరుగుతుందని సీజే తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు జరుగుతుండగానే.. క్రాస్టాక్ రావడం పట్ల సీజే అభ్యంతరం వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లోకి ఎంటర్ అయ్యే పాస్వర్డ్ లీక్ చేయడం వల్లే ఇలా జరుగుతుందని పేర్కొంది. సోమవారం నుంచి హైకోర్టులోనే విచారణ ఉంటుందని.. భౌతిక దూరం పాటిస్తూ విచారణకు అందరూ సహకరించాలని ఆదేశించారు.