YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

సిరియాలో బాంబు దాడి..46 మంది దుర్మరణం

సిరియాలో బాంబు దాడి..46 మంది దుర్మరణం

సిరియాలో బాంబు దాడి..46 మంది దుర్మరణం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29
నిత్యం బాంబులతో దద్దరిల్లే సిరియా... మరోసారి దాడితో చిగురటాకులా వణికిపోయింది. సిరియాలోని అఫ్రిన్ లో బాంబుపేలుళ్లు సంభవించాయి. పెట్రోల్ టాంకర్‌ను కొందరు బాంబులతో పేల్చారు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 46మంది మరణించగా.. 50 మందికి గాయాలయ్యాయి. పేలుళ్లు జరిగిన వెంటనే సమాచారం అందుకున్న సిరియా సివిల్ డిఫెన్స్ వర్కర్స్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొంది. అవసరమైన సహాయక చర్యలుచేపట్టింది . ఈ దాడిలో టర్కీకి చెందిన కొంతమంది కూడా మరణించి ఉంటారని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.మరోవైపు ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిని అమెరికా ప్రభుత్వం ఖండించింది. పవిత్రమైన రంజాన్ మాసం సమయంలో ఇలా దాడులు చేయడం సరికాదని పేర్కొన్నది. గాయపడిన వ్యక్తులను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రంజాన్ ముస్లింలకు పవిత్రమాసం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లీంలు ఈ సమయంలో కఠినంగా ఉపవాస దీక్షలు చేస్తుంటారు. ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం పాటిస్తారు. సూర్యాస్తమయం తరువాత ఉపవాస దీక్షను విడిచి ఆహారం తీసుకుంటారు. అయితే, ఇలా ఉపవాస దీక్ష విడిచే సమయంలో పెట్రోల్ టాంకర్‌ను బాంబులతో పేల్చారు.
========

Related Posts