YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

తిరిగి తెరుచుకున్న కేథ‌ర్‌నాథ్ ఆల‌యం

తిరిగి తెరుచుకున్న కేథ‌ర్‌నాథ్ ఆల‌యం

తిరిగి తెరుచుకున్న కేథ‌ర్‌నాథ్ ఆల‌యం
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 29
ఆరు నెల‌ల పాటు మంచుతో క‌ప్ప‌బ‌డిన కేథ‌ర్‌నాథ్ ఆల‌యం బుధ‌వారం ఉదయం 6:10 గంటలకు తిరిగి తెరుచుకుంది. ఏటా ఆల‌యాన్ని సంద‌ర్శించేందుకు ల‌క్ష‌లాది మంది భ‌క్త‌జ‌న సందోహం త‌ర‌లివస్తారు. కానీ క‌రోనా కార‌ణంగా ఈ సంవ‌త్స‌రం భ‌క్తులెవ‌రినీ  అనుమ‌తించ‌లేదు. తాత్కాలిక ఆల‌యం ద‌ర్శ‌నం ర‌ద్దు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆల‌య ప్ర‌ధాన పూజారి స‌హా అతికొద్దిమంది స‌మ‌క్షంలో ఉద‌యం  విగ్ర‌హాన్ని ఆల‌యానికి తీసుకువ‌చ్చారు.  చార్‌ధామ్ యాత్ర‌లో అతి ముఖ్య‌మైన డోలి యాత్రలో నిజాన‌కి భ‌క్తుల ర‌ద్దీ విప‌రీతంగా ఉంటుంది. కానీ ఈసారి ఆ సంద‌డి లేదు.  చార్‌ధామ్‌ యాత్రలో యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్‌ ఆలయాలను  ద‌ర్శించేందుకు  ప్రతి సంవత్సరం దేశ‌, విదేశాల నుంచి  లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. కానీ ఈసారి భ‌క్త జ‌న కోలాహాలం లేకుండానే తంతు పూర్తిచేశారు ఆల‌య అర్చ‌కులు. ఐదుగురు పండితులు కేథ‌ర్‌నాథ్ ఆల‌యానికి పంచ‌ముఖీ స్వామిని ప‌ల్ల‌కిలో తీసుకువ‌చ్చారు.
 

Related Posts