విద్యాసాగర్రావు స్ఫూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టు ఆవిస్కరణ: కేసీఆర్
హైదరాబాద్ ఏప్రిల్ 29
సమైక్య పాలనలో తెలంగాణ జల నిపుణుడు ఆర్.విద్యాసాగర్రావు సాగునీటి రంగంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆర్. విద్యాసాగర్రావు వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ ఇంజినీర్లు విద్యాసాగర్రావు ఇచ్చిన స్ఫూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టును ఆవిష్కరించారని సీఎం కొనియాడారు. విద్యాసాగర్రావు ఆశయాల మేరకు సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చామని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అవతరించిన తెలంగాణ రాష్ట్రమే విద్యాసాగర్ రావుకు నిజమైన నివాళి. అని సీఎం పేర్కొన్నారు.