YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

నల్లగొండ విషాదం... మృతులంతా మహిళలే 2 లక్షల చొప్పన నష్టపరిహారం

 నల్లగొండ విషాదం... మృతులంతా మహిళలే 2 లక్షల చొప్పన నష్టపరిహారం

నల్లగొండ జిల్లాలోని ఏపీపల్లి మండలం పడమటి తండాలో ట్రాక్టర్ బోల్తాపడి 9 మంది మృతి చెందారు ప్రమాద బాధిత కుటుంబాలను మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు కలెక్టర్ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలను మంత్రి ప్రకటించారు. అంత్యక్రియలకు తక్షణ సహాయం కింద రూ. 10వేల నగదు అందజేశారు. సీఎం సహాయనిధి నుంచి ఆర్ధిక సాయం కోసం సీఎంతో మాట్లాడుతామని మంత్రి తెలిపారు. బాధితుల పిల్లలకు డిగ్రీ పూర్తి చేసే వరకు చదువు బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుందని హామి ఇచ్చారు.

చనిపోయిన వాళ్లంతే మహిళలే

నల్లగొండ జిల్లా పెద్దఅడిశరపల్లి మండలం ఒద్దిపట్ల పడమటి తండా వద్ద వ్యవసాయ పనులకు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో 9 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారంతా మహిళలే .ఒద్దిపట్ల పడమటి తండాకు చెందిన గిరిజనులను వ్యవసాయ పనులకు ట్రాక్టర్‌తో తరలిస్తుండగా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ కాల్వలోకి వారు ప్రయాణిస్తోన్న వాహనం దూసుకెళ్లడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో 30 మందిపైగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో 19 మందిని రక్షించగా, హనుమంతు అనే స్థానికుడు తన ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా పది మందిని కాపాడాడు. గాయపడిన వారిలో ఐదుగుర్ని చికిత్స కోసం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. పడమటి తండా నుంచి పెద్దాపురం మండలం పులిచర్లకు మిరపచేనులో పనులకు కూలీలు ట్రాక్టర్‌లో బయలుదేరిన 20 నిమిషాల్లోనే మృత్యువాత పడ్డారు. వేగంగా వెళ్తున్న సమయంలో డ్రైవర్‌కు ఫోన్ రావడంతో ప్రమాదం జరగిందని బాధితులు చెబుతున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని పడమటి తండాకు చెందిన రమావత్ సోనా (70), రమావత్ జీజా (65), బానావత్ బేరి (55), రమావత్ కేలీ (50), రమావత్ కంస్లి (50), రమావత్ భారతి (35), రమావత్ సునీత (30), జరుకుల ద్వాలి (30), రమావత్ లక్ష్మీగా గుర్తించారు. కాల్వలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయకార్యక్రమాలను అంతరాయం ఏర్పడింది. దీంతో పుట్టగండి సిస్టర్ వద్ద ఏఎంఆర్ కాల్వకు నీళ్లు నిలిపివేసి, ట్రాక్టర్‌ను తాళ్ల సాయంతో బయటకు తీయడానికి ప్రయత్నించారు.  తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర ప్రమాదంపై మంత్రులు జగదీష్‌‌రెడ్డి, మహేందర్‌‌‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రులు సంతాపం ప్రకటించారు. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ రంగనాథ్, జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పరిశీలించారు. మృతుల బంధువులు, కుటుంబసభ్యుల రోదనలతో ఘటనాస్థలి విషాదంగా మారింది. 

Related Posts