YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఉద్యోగులకు కేంద్రం మరికొన్ని షరతులు..!

ఉద్యోగులకు కేంద్రం మరికొన్ని షరతులు..!

ఉద్యోగులకు కేంద్రం మరికొన్ని షరతులు..!
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30,
ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా మరి కొన్ని మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇవి తక్షణం అమలయ్యేలా చూడాలని వివిధ శాఖల జాయింట్ సెక్రెటరీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.కరోన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్త షరతు విధించింది. ఈ షరతు తక్షణం అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర మంత్రిత్వ శాఖల్లోను, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోనూ ఈ షరతు అమలయ్యేలా చూడాలని వివిధ శాఖల జాయింట్ సెక్రెటరీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ఆరోగ్య సేతు యాప్‌ని ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఉపయోగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా మరి కొన్ని మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, అవుట్‌ సోర్సింగ్‌ స్టాఫ్.. తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ని తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రతిరోజు ఆఫీసుకు బయలుదేరే ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇతర సిబ్బంది తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌లో తమ హెల్త్‌ స్టేటస్ చెక్ చేసుకోవాలని.. యాప్‌లో ‘‘సేఫ్’’ లేదా ‘‘ లో రిస్క్’’ అని చూపెడితేనే కార్యాలయానికి రావాలని తాజా ఆదేశాలలో పేర్కొన్నారు.ఒకవేళ బ్లూటూత్ సామీప్యత ఆధారంగా ఆరోగ్య సేతు యాప్‌లో ‘‘మోడరేట్’’ లేదా ‘‘హైరిస్క్’’ అని స్టేటస్ చూపిస్తే ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని ఉత్తర్వులలో పేర్కొన్నారు. అలాంటి వారు 14 రోజులు హోం క్వారెంటైన్‌లో వుండాలని తెలిపింది. ఆరోగ్య సేతు యాప్‌లో ‘‘లో రిస్క్’’ అని కానీ ‘‘సేఫ్’’ అని కానీ చూపించే వరకు ఇంటి దగ్గరే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

Related Posts