క్వారంటైన్ లో చంద్రబాబు
నూజివీడు ఏప్రిల్ 30
కృష్ణాజిల్లా నూజివీడు మండలం తుక్కు ల్లూ రు వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు అధ్వర్యంలో 15టన్నుల కూరగాయలు 12 రకాలు ఒక కిట్ గా చేసి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇప్పటికే హైదరాబాదు లో హోమ్ క్వారంటన్ లో ఉన్నాడు పొరుగు రాష్ట్రాలలో ఉండి ఎపి గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. మరో మూడు నెలలపాటు చంద్రబాబు నాయుడు క్వారంటన్ లో ఉండాలి. ఎపిలో జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. వైసీపీ వాళ్ళలకు కరోనా వస్తే స్వచ్చందంగా క్వారంటైన్ లోకి వెళ్తాము..ఎవరికైన వ్యాధులు వస్తే ఎవరైన తప్ప దు. ఇప్పటికీ టిడిపి పార్టీ వారు క్వారంటైన్ కు పరిమితమైయారని విమర్శించారు.