YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ఆపడం సాధ్యం కాదని :సుప్రీంకోర్టు

సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ఆపడం సాధ్యం కాదని :సుప్రీంకోర్టు

సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ఆపడం సాధ్యం కాదని :సుప్రీంకోర్టు
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 30
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ప్రస్తుతానికైతే ఆపడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ ప్రాజెక్టు కొరకు జారీ చేసిన భూవినియోగం మార్పు నోటిపికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మారుతున్న అవసరాలకు అనుగణమైన నూతన పార్లమెంటు, మంత్రిత్వ శాఖలకు విశాలమైన కేంద్ర సెక్రటేరియట్, ప్రధాని, ఉపరాష్ట్రపతి కొరకు నూతన నివాస భవనాలు మొదలైనవాటితో కూడిన భారీ ప్రాజెక్టునే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా అని పిలుస్తున్నది. 2024లో పూర్తయ్యే ఈ విస్టా ప్రాజెక్టుకు కేంద్రం రూ.20,000 కోట్లు కేటాయించింది. ఈ కేటాయింపును రద్దు చేసి కరోనా అవసరాలకు ఆ సొమ్మును మళ్లించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని నరేంద్రమోదీకి రాసిన ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు ప్రస్తుత భవనంలో సౌకర్యవంతంగా తన పనిని కొనసాగించవచ్చని, కొత్త భవనాల నిర్మాణం తక్షణ అవసరం ఏమీ కాదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంత సొమ్ము ఖర్చు చేయడం దుబారా అవుతుందని సోనియా తన లేఖలో తెలిపారు. ఎంపీలాడ్స్ నిదులను నిలిపివేసి ఆ సొమ్మును కరోనాకు మళ్లిస్తున్న కేంద్రం మరోవైపు సెంటర్ల విస్టా ప్రాజెక్టుకు రూ.20,000 కోట్లు ఖర్చుపెట్టాలని చూస్తున్నదని తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రా కూడా దుయ్యబట్టారు. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ గత డిసెంబర్‌లో సౌత్ బ్లాక్ సమీపంలో డల్‌హౌసీ రోడ్డుపై ప్రధాని నూతన నివాసం నిర్మాణం కొరకు 15 ఎకరాల స్థలవినియోగాన్ని వినోద అవసరాల నుంచి నివాస అవసరాలకు మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశం కరోనా కల్లోలం ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో కేంద్రం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడం భావ్యం కాదని విపక్షాలు అంటున్నాయి.

Related Posts