YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

భర్త బయిటకు వెళ్లిన తర్వాత పనిమనిషితో రాసలీలలు

భర్త బయిటకు వెళ్లిన తర్వాత పనిమనిషితో రాసలీలలు

భర్త బయిటకు వెళ్లిన తర్వాత పనిమనిషితో రాసలీలలు
లక్నో, ఏప్రిల్ 30,
లాక్‌డౌన్ కారణంగా మానవ సంబంధాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల విడిపోయిన వారు కలుస్తుండగా, మరికొన్ని సందర్భాల్లో అనేక మంది ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు బయటపడుతున్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని నోయిడా జరిగిన ఓ ఘటన భార్యభర్తల విడాకులకు కారణమైంది. నోయిడాకు చెందిన రింకీ కపూర్, పంకజ్‌కు కొన్నాళ్ల క్రితం వివాహమైంది. పంకజ్ వ్యాపార పనుల నిమిత్తం మార్చి నెలలో ఛండీగఢ్ వెళ్లాడు. ఈ లోగా కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో అక్కడే ఉండిపోయాడు. ఇదే విషయం భార్యకు చెప్పడంతో ఇన్నిరోజులు తాను ఒంటరిగా ఎలా ఉండాలని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పంకజ్ తన ఇంట్లో పనిచేసే రితేశ్ త్యాగి అనే యువకుడికి ఫోన్ చేసి తాను వచ్చేవరకు రింకీకి తోడుగా ఉండాలని చెప్పాడు. దీంతో రితేశ్ ఆ ఇంట్లోనే ఉంటూ యజమానురాలికి కావాల్సిన వస్తువులు తెచ్చి పెట్టేవాడు. ఆమె చెప్పిన పనులన్నీ చేసేవాడు.లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడిన రింకీకి మద్యం తాగే అలవాటు కూడా ఉండేది. కొద్దిరోజుల పాటు ఒంటరిగానే మద్యం తాగిన రింకీ.. తర్వాత రితేష్‌ను కంపెనీ ఇవ్వాలని కోరేది. దీంతో రోజూ ఇద్దరూ కలిసి మద్యం తాగేవారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది. ఓ రోజు మద్యం మత్తులో ఇద్దరూ లైంగికంగా కలిశారు. భర్త ఇంట్లో లేకపోవడంతో రింకీకి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. రోజూ పనోడితో బెడ్రూమ్‌లో రాసలీలలు కొనసాగించేది. రోజూ ఇద్దరూ కలిసి మద్యం తాగడం, గదిలో లైంగిక వాంఛలు తీర్చుకోవడం ఇదే దినచర్యగా మారిపోయింది.భార్య బాగోతం తెలియని పంకజ్ మాత్రం రోజూ భార్యకు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకునేవాడు. రితేశ్ తనను బాగా చూసుకుంటున్నాడని, కంగారు పడాల్సిన పనేమీ లేదని ఆమె చెప్పడంతో పంకజ్ ధైర్యంగా ఉండేవాడు. అయితే ఇలాంటి సంబంధాలు ఎక్కువ కాలం దాగవు కదా. ఇలాగే రింకీ, రితేశ్ అక్రమ సంబంధం ఓ రోజు భర్త కంట పడింది. పంకజ్ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. దీంతో అతడు ఛండీగఢ్ నుంచే రోజూ తన ఇంటి బయట ఏం జరుగుతుందో గమనించేవాడు.ఈ విషయం తెలియని రింకీ ఆరుబయట ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఓ రోజు మద్యం తాగుతూ, ఈత కొడుతూ పనోడితో రొమాన్స్ చేస్తుండటాన్ని పంకజ్ గమనించాడు. ఈ విషయాన్ని దగ్గర్లోని బంధువులకు ఫోన్ చేసి చెప్పగా.. వారు రింకీని నిలదీశారు. భర్త కళ్లుగప్పి ఇలాంటి పనులేంటి అని మందలించారు. దీంతో కొత్త నాటకానికి తెరదీసిన రింకీ ఆత్మహత్య చేసుకుంటానంటూ వారిని బెదిరించింది. ఈ విషయాన్ని బంధువుల ద్వారా తెలుసుకున్న పంకజ్.. భార్యకు ఫోన్ చేసి ‘నీ గుట్టు తెలిసిపోయింది. విడాకులకు సిద్ధంగా ఉండు’ అని చెప్పడంతో ఆమె రెచ్చిపోయింది.తనకు విడాకులిస్తే ‘నా చావుకు నువ్వే కారణం’ అని లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంటానని రింకీ బెదిరించింది. దీంతో బంధువుల సాయంతో పంకజ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రింకీపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా భార్య ఒంటరిగా ఉంటుందన్న ఆందోళనతో పనోడిని ఇంట్లో పెట్టడమే తన కాపురాన్ని నాశనం చేసిందని పంకజ్ వాపోతున్నాడు. మద్యం మత్తులో పనోడితో రాసలీలలు జరిపిన.. రింకీ భర్త అడ్డు లేకపోవడంతోనే అతడితో విచ్చలవిడిగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది

Related Posts